Skip to main content

NMMS Examination: ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష కోసం దరఖాస్తుకు 25 వరకూ అవకాశం

Application for NMMS Examination, NMMS Examination Date,"District Education Officer Nagaraju's Statement

రాప్తాడురూరల్‌: నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 25 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్‌ 3న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మునిసిపల్‌, ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, హాస్టల్‌ వసతి లేని మోడల్‌ స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులని వెల్లడించారు. ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుని ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మరిన్ని వివరాలకు ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయం, అనంతపురంలో సంప్రదించాలని సూచించారు

చదవండి: Art competitions: అక్టోబర్‌ 2న విద్యార్థులకు చిత్రకళ పోటీలు

Published date : 22 Sep 2023 02:50PM

Photo Stories