5th Class Admission : ఎంజే పీఏపీబీసీడబ్ల్యూఆర్ఈలో ఐదో తరగతి ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
![MJ PAPBCWRE](/sites/default/files/2022-04/mjpapbcwre.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కానూరు(విజయవాడ)లోని మహాత్మాజ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీఏపీబీసీ డబ్ల్యూఆర్ఈ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 99 గురుకుల పాఠశాలల్లో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతి (ఇంగ్లిష్ మీడియం) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 2020–21లో మూడో తరగతి, 2021–22లో నాలుగో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. 2020–21 సంవత్సరానికి గాను తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,00,000 మించకుండా ఉండాలి.
వయసు: ఇతరులు 01.09.2011 నుంచి 31.08.2013 మధ్య ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 01.09.2009 నుంచి 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా .
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.04.2022
వెబ్సైట్: http://apgpcet.apcfss.in