Skip to main content

ఐఐటీ, తిరుపతిలో ఎంటెక్‌ కోర్సులో అడ్మిషన్స్‌.. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్‌ 23..

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. 2021 విద్యాసంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంటెక్‌) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: సివిల్‌–ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌
అర్హత: గేట్‌ 2019,2020,2021 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. బీఈ/బీటెక్‌ చివరి ఏడాది పరీక్షలకు హాజరై వాటి ఫలితాలు జూలై 2021లోపువచ్చే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఐటీ గ్రాడ్యుయేట్లు 8 జీపీఏ మార్కులతో ఐఐటీ బీటెక్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చే సుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 23.04.2021

పూర్తి వివ‌రాలకు వెబ్‌సైట్‌: http://admissions.iittp.ac.in

Photo Stories