Skip to main content

ఐఐటీ భిలాయ్‌లో ఎంటెక్‌.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్‌ 19..

భిలాయ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ).. 2021 విద్యాసంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంటెక్‌)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో బీఈ/బీటెక్, మాస్టర్స్‌ డిగ్రీ(సైన్స్‌)/తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్‌ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.04.2021

ఆన్‌లైన్‌ ఇంటర్వూ తేది: 09.05.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iitbhilai.ac.in

Photo Stories