Skip to main content

NEET 2024 Results: ‘నీట్‌’లో కోరుట్ల విద్యార్థుల ప్రతిభ

కోరుట్లరూరల్‌: జూన్ 4న‌ రాత్రి విడుదలైన ‘నీట్‌’లో పట్టణానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటారు.
Potuganti Rashmita  Korutla student toppers in NEET  Miriyala Saipraneeth Reddy Chawla Dhanasree

మిరియాల సాయిప్రణీత్‌ రెడ్డి 614 మార్కులు, చావ్ల ధనశ్రీ 496 మార్కులు సాధించారు. కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన పోతుగంటి రశ్మిత 472 మార్కులు సాధించింది. సాయిప్రణీత్‌ రెడ్డి, చావ్ల ధనశ్రీ మొదటిసారి ఎంట్రెన్స్‌ రాయగా రశ్మిత రెండోసారి రాసింది.

చదవండి: NEET 2024 Results: ఆలిండియా నీట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌గా గుగులోత్‌ వెంకట నృపేష్‌

సాయిప్రణీత్‌ రెడ్డి తండ్రి రాజరెడ్డి, తల్లి జమున ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. చావ్ల ధనశ్రీ తండ్రి లక్ష్మీనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి కృష్ణవేణి గృహిణి, రశ్మిత తండ్రి లక్ష్మీనారాయణ ప్రైవేటు అధ్యాపకుడు, తల్లి జ్యోతి గృహిణి. వీరికి ఎంబీబీఎస్‌లో ఏ కేటగిరిలోనే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Published date : 06 Jun 2024 10:28AM

Photo Stories