Skip to main content

Job Mela in Andhra Pradesh: ఆగస్టు 4న ఉద్యోగ మేళా

Job Mela in Andhra Pradesh

ఆలూరు: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఆగస్టు 4వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఆలూరులోని మంత్రి కార్యాలయంలో గురువారం జాబ్‌మేళా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రముఖ కంపెనీలైన హెటిరోడ్రగ్స్‌, హిల్‌ మైఫ్యామిలీ, గ్రీన్‌టెక్‌, అమర్‌ రాజ్‌ బ్యాటరీ, ఎన్‌లైట్‌కాడ్‌, టీసీఎల్‌, అరబిందో ఫార్మా, నవభారత్‌ ఫర్టిలైజర్స్‌, ఎల్‌అండ్టీ, పేటీఎం, ఫ్లిఫ్‌ కార్డు, వైఎస్‌కే ఇన్ఫో టెక్‌లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఆలూరుకు వచ్చిన నిరుద్యోగులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారని తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, ఎంబీఏ, బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వృత్తి నైపుణ్యభివృద్ధి అధికారి వి, క్రాంత్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శంకర్‌ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
 

Jagananna Videshi Vidya Deevena Scheme: విదేశీ కల విద్యా దీవెనతో సాకారం.. 21 మందికి రూ.3.37 కోట్లు అందజేత

Published date : 28 Jul 2023 03:37PM

Photo Stories