Employees: 28న ఉద్యోగుల భవిష్యత్ నిధి కార్యక్రమం
Sakshi Education
శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలో గల రిమ్స్ ఆస్పత్రి జంక్షన్, బలగ ప్రాంతంలో గల నవీనా కాంప్లెక్స్ పైఫ్లోర్లో ఉన్న కార్మిక శాఖ భవనంలో 28వ తేదీన ఉద్యోగుల భవిష్యత్ నిధి ఎన్.ఎ.ఎన్–2.0 కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ అధికారి షేక్ మహమ్మద్ బాషా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన ఫిర్యాదులను తమ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి పరిష్కరించేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొ న్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Published date : 23 Aug 2023 03:10PM