AP Electricity Department: జూనియర్ లైన్మెన్లు రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ..
Sakshi Education
![AP Electricity Department](/sites/default/files/images/2023/08/05/apspdcl-1691228528.jpg)
అనంతపురం టౌన్: విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్లుగా రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్ఈ సురేంద్ర తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న జూనియర్ లైన్మెన్లు 380 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వీరందరినీ రెగ్యులర్ చేశామని, విద్యుత్ సంస్థ నిబంధనల మేరకు జీతాలతోపాటు అలవెన్సులు, పీఆర్సీ అమలు చేయనున్నామని తెలిపారు.
SHAR: పది, డిప్లొమా అర్హతతో శ్రీహరికోటలో ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి
Published date : 05 Aug 2023 03:12PM