Skip to main content

Taj Mahal: ఆగ్రాలో మరో తాజ్ మహల్.. రాధాస్వామి సత్సంగ్ భవనం

ఆగ్రా అంటేనే తాజ్ మహల్ అని అందరికీ తెలుసు. కానీ.. ఇక్కడే మరో అద్భుతమైన పాలరాతి భవనం ఉందని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది.
second tajmahal in agra  Taj Mahal Gets Competition As New White Marble Marvel Opens In Agra

ఈ భవనం తాజ్ మహల్‌కు పోటీనిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

రాధాస్వామి సత్సంగ్ శాఖ వ్యవస్థాపకుడు పరమ పురుష్ పూరన్ ధని స్వామీజీ సమాధి స్థలంపై నిర్మించబడిన ఈ భవనం, స్వచ్ఛమైన తెల్లని పాలరాతితో నిర్మితమై, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

తాజ్ మహల్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న స్వామి బాగ్‌లో ఈ భవనం ఉండడం వల్ల దీనిని "రెండో తాజ్ మహల్" అని కూడా పిలుస్తారు.

193 అడుగుల ఎత్తు ఉన్న ఈ భవనం.. రాజస్థాన్‌లోని మక్రానా నుంచి తెచ్చిన తెల్లని పాలరాతితో నిర్మించబడింది.

Blue Hole: సముద్ర గర్భంలో ఉండే లోతైన నీలి రంధ్రం బిలాలు ఇవే..

ఈ భవన నిర్మాణం 1904లో ప్రారంభమైంది. కొంతకాలం ఆగిపోయిన తర్వాత, 1922లో మళ్లీ ప్రారంభమైంది. ఈ భవన నిర్మాణంలో హస్తకళాకారుల నైపుణ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మూడు తరాలకు చెందిన కళాకారులు ఈ భవన నిర్మాణంలో పాల్గొన్నారు.

తాజ్ మహల్ కంటే పొడవైన శిఖరం ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణ. రాధాస్వామి అనుచరులకు ఈ భవనం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు ఈ సమాధి స్థలాన్ని సందర్శిస్తారు. ఫోటోగ్రఫీకి అనుమతి లేకపోవడం ఈ భవనం యొక్క ప్రత్యేకత. 

ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక‌తో పాటు అనేక రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఈ భవనాన్ని సందర్శిస్తారు.

Happiest Country: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏదో తెలుసా?

Published date : 20 May 2024 01:53PM

Photo Stories