Skip to main content

జేఎల్‌ఎం గ్రేడ్‌ – 2 ఉద్యోగుల క్రమబద్ధీకరణ

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఎస్పీడీసీఎల్‌ పరిధిలో జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌ – 2గా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సీఎండీ సంతోషరావు ఉత్తర్వులను గురువారం జారీ చేశారు.
Junior Lineman
జేఎల్‌ఎం గ్రేడ్‌ – 2 ఉద్యోగుల క్రమబద్ధీకరణ

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న 572 మంది జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌ – 2లను ఇక నుంచి శాశ్వత ఉద్యోగులుగా పరిగణించనున్నారు. గతేడాది జూలై ఒకటి నుంచి వీరిని క్రమబద్ధీకరిస్తున్నట్లు.. అప్పటి నుంచి రావాల్సిన అరియర్స్‌నూ చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జేఎల్‌ఎం గ్రేడ్‌ – 2 ఉద్యోగులుగా వీరు 2019, అక్టోబర్‌ రెండున విద్యుత్‌ సంస్థలోకి వచ్చారు. తమను క్రమబద్ధీకరిస్తూ ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి జేఎల్‌ఎం గ్రేడ్‌ – 2లు కృతజ్ఞతలను తెలియజేశారు.

Published date : 04 Aug 2023 04:36PM

Photo Stories