Skip to main content

పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల

తిరుపతి సిటీ: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వ హిస్తున్న ఎంటెక్‌, ఎంపార్మసీ, పార్మా–డి, కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు పీజీ సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌వీఎస్‌ సత్యనారాయణ తెలిపారు.
Release of notification for admission in PG courses
పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల

గేట్‌, జి పాట్‌ అర్హత మార్కులు కలిగిన జనరల్‌ అభ్యర్థులు రూ. 600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 ఈ నెల 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ఈ నెల 9 నుంచి 11వ తేదీలోపు ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. వెబ్‌ ఆఫ్షన్లు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని కోరారు. 22వ తేదీ నుంచి గేట్‌, జి పాట్‌ అభ్యర్థులకు సీట్లు అలాట్‌ చేస్తామన్నారు. పీజీఈసెట్‌–2023లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 26 నుంచి 31 తేదీలోపు ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయా లని తెలిపారు. వచ్చేనెల 8 నుంచి 11వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్‌లు నమోదు చేసుకోవాలని, అదే నెల 15వ తేదీ నుంచి సీట్లు అలాట్‌ చేస్తామన్నారు. https// cets.apsche.apgov.in వెబ్‌సైట్‌ను వీక్షించి ధ్రువపత్రాలు, రుసుం చెల్లించి పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందాలని ఆయన పేర్కొన్నారు.

Published date : 02 Aug 2023 03:46PM

Photo Stories