AP EAPCET ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు
Sakshi Education
మురళీనగర్: ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ అడ్మిషన్లకు సంబంధించి వెబ్ ఆప్షన్లు గడువు పొడిగించినట్లు కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కేడీవీ నరసింహారావు చెప్పారు.
ఇంజినీరింగ్ ఆప్షన్ల గడువు పొడిగింపు
ఈ ఆప్షన్లకు ఈనెల 7వ తేదీ నుంచి 12వరకు మొదట అవకాశం ఇచ్చారు. అయితే విద్యార్థులకు మరింత అవకాశం కల్పించేందుకు ఈ గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించారు. ఆప్షన్లను ఈనెల 16న మార్పు చేసుకోవచ్చు. 23న సీట్ల కేటాయింపు, 23 నుంచి 31వ తేదీ వరకు వారికి కేటాయించిన కాలేజీలో సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
ఆగస్టు 31వ తేది నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మారిన షెడ్యూల్ దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.