ICC Awards: క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి ఎంపికైన భారతీయురాలు?
భారత అగ్రశ్రేణి క్రికెటర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యుత్తమ పురస్కారానికి ఎంపికైంది. 2021 ఏడాదికి గాను మహిళల విభాగంలో ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును స్మృతి గెలుచుకుంది. మూడు ఫార్మాట్లలోనూ ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఎడంచేతి వాటం ఓపెనర్ అయిన స్మృతి 2021 ఏడాది 22 అంతర్జాతీయ మ్యాచ్లలో 38.86 సగటుతో 855 పరుగులు సాధించింది. స్మృతి ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికవడం ఇది రెండోసారి. 2018లో ఈ అవార్డుతో పాటు ఆమె ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా కూడా నిలిచింది. 2021 ఏడాది మహిళల విభాగంలో ట్యామీ బీమాంట్ (టి20), లిజెల్ లీ (వన్డే) అత్యుత్తమ ప్లేయర్లుగా నిలిచారు.
రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ..
ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2017 నుంచి రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ అని పిలుస్తున్నారు. ఈ అవార్డును ఇంగ్లండ్కి చెందిన మహిళా క్రికెట్ దిగ్గజం, అడ్మినిస్ట్రేటర్ అయిన రాచెల్ హేహో ఫ్లింట్ జ్ఞాపకార్థం.. ఐసీసీ అవార్డుల వేడుకలో భాగంగా ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నారు.
చదవండి: సయ్యద్ మోదీ టోర్నీలో విజేతగా నిలిచిన స్టార్ షట్లర్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం–2021కు ఎంపికైన భారతీయురాలు?
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : భారత అగ్రశ్రేణి క్రికెటర్ స్మృతి మంధాన
ఎందుకు : క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను..
డౌన్లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్లోడ్ ఇలా...
డౌన్లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్