టెన్నిస్ డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్కుమార్ రామనాథన్ జంట భారత్కు రజత పతకం అందించింది.
ASian Games 2023 men's doubles tennis
ఫైనల్లో సాకేత్–రామ్కుమార్ ద్వయం 4–6, 4–6తో జేసన్ జంగ్–యు సియో సు(చైనీస్ తైపీ) జంట చేతిలో ఓటమి చవిచూసింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాకేత్కిది ఆసియా క్రీడల్లో మూడో పతకం. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సాకేత్ పురుషుల డబుల్స్లో సనమ్ సింగ్తో కలిసి రజతం... మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జాతో కలిసి స్వర్ణ పతకం సాధించాడు.