Asian Games 2023 badminton: పురుషుల బ్యాడ్మింటన్లో భారతకు స్వర్ణం
Sakshi Education
పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో భారతకు స్వర్ణం లభించింది.
Asian Games 2023 badminton
పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో భారత జోడీ చిరాగ్ షెట్టి, సాత్విక్ సాయిరాజ్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం.. సౌతా కొరియా జోడీ కిమ్-చోయ్పై 21-18, 21-16 వరుస సెట్లలో విజయం సాధించి, చరిత్ర సృష్టించింది.
ఏషియన్ గేమ్స్ చరిత్రలో(బ్యాడ్మింటన్) భారత్కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. గతంలో భారత్ ఎన్నడూ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ సాధించలేదు. ప్రస్తుత ఏషియన్ గేమ్స్లో భారత్కు ఇది (బ్యాడ్మింటన్లో) మూడో పతకం. పురుషుల టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్, పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ కాంస్య పతకం సాధించారు.