Mohammed Faizal: లక్షద్వీప్ ఎంపీపై వేటు
Sakshi Education
హత్యాయత్నం నేరంలో ఇటీవల దోషిగా తేలిన లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ను అనర్హుడిగా ప్రకటిస్తూ జనవరి 13వ తేదీ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
![Mohammed Faizal](/sites/default/files/images/2023/01/16/mahamad-fasal-1673863694.jpg)
కవరట్టిలోని సెషన్స్ కోర్టు ఆయన్ను దోషిగా ప్రకటించిన జనవరి 11వ తేదీ నుంచి ఆయన లోక్సభ సభ్యత్వ అనర్హత అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని ఆర్టికల్ 102(1)(ఇ) ప్రకారం ఈ మేరకు ప్రకటిస్తున్నట్లు వివరించింది. హత్యాయత్నం నేరం రుజువు కావడంతో లక్షద్వీప్లోని కోర్టు ఫైజల్ సహా నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
Mohammed Faizal: లక్షద్వీప్ ఎంపీకి పదేళ్ల ఖైదు
Published date : 16 Jan 2023 03:38PM