Mahesh Chandra Laddha: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్ చంద్ర లడ్హా
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్హాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
![IPS Mahesh Chandra Laddha appointed as AP Intelligence Chief](/sites/default/files/images/2024/07/03/mahesh-chandra-laddha-1720007331.jpg)
ఈయన 1998 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. నాలుగేళ్లుగా డెప్యూటేషన్ మీద కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపంపై కేంద్ర హోం శాఖ ఆయన్ను ఇటీవలే రాష్ట్ర సర్వీసులకు తిరిగి పంపింది.
ఈ నేపథ్యంలో మహేశ్ చంద్ర లడ్హాను రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ జులై 2వ తేదీ ఉత్తర్వులు జారీ చేశారు.
Indian Army: చరిత్రలో మొదటిసారి ఆర్మీ, నేవీ చీఫ్లుగా క్లాస్మేట్స్
Published date : 03 Jul 2024 05:18PM