Skip to main content

Maharashtra New CM: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ షిండే

new Chief Minister Eknath Shinde

మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే ఈరోజు (గురువారం) సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎం.. ఏక్‌నాథ్‌ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర సీఎంగా  ప్రమాణ స్వీకారణం చేయనున్నట్లు ఫడ్నవీస్‌ స్వయంగా ప్రకటించారు.

వ్యూహం మార్చిన బీజేపీ
గత పది రోజులుగా ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మహారాష్ట్రలో బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంది. ఉద్దవ్‌ సర్కార్‌ను కూలదోసామన్న పేరు రాకుండా జాగ్రత్త పడింది. దీంతో మహారాష్ట్ర సర్కార్‌ను బీజేపీ వెనకుండి నడిపించేందుకు సిద్ధమైంది. ఎవరూ ఊహించని విధంగా ఏక్‌నాథ్‌ షిండే ఆధ్వర్యంలో మహారాష్ట్ర సర్కార్‌ కొలువుదీరనుంది. 

అంతకుముందు ఏక్‌నాథ్‌ షిండే గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గోవా నుంచి ముంబై చేరుకున్నారు. ముంబై చేరిన ఏక్‌నాథ్‌ షిండే తొలుత బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు కలిసి రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీని కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించారు.

Published date : 30 Jun 2022 05:11PM

Photo Stories