India gifts Dornier-228 : శ్రీలంక నేవీకి భారత్ డోర్నియర్ నిఘా విమానం అందజేత
Sakshi Education
భారత్ 76వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని శ్రీలంక నేవీకి డోర్నియర్ నిఘా విమానాన్ని బహుమానంగా అందజేసింది.
![](/sites/default/files/images/2022/08/17/ind-sre-1660732644.jpg)
దీనివల్ల శ్రీలంక నేవీకి సముద్రజలాలపై నిఘా సామర్థ్యం మరింతగా పెరుగుతుందని భారత్ తెలిపింది. కొలంబో సమీపంలోని కతునాయకే వైమానిక స్థావరంలో ఆగస్టు 15వ తేదీన (సోమవారం) ఆ దేశాధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భారత నేవీ వైస్ చీఫ్ గోర్మండే, శ్రీలంకలో భారత హై కమిషనర్ గోపాల్ బాగ్లే ఈ విమానాన్ని అందజేశారు.
Published date : 17 Aug 2022 04:07PM