Skip to main content

India gifts Dornier-228 : శ్రీలంక నేవీకి భారత్‌ డోర్నియ‌ర్‌ నిఘా విమానం అందజేత

భారత్ 76వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని శ్రీలంక నేవీకి డోర్నియ‌ర్ నిఘా విమానాన్ని బహుమానంగా అందజేసింది.

దీనివల్ల శ్రీలంక నేవీకి సముద్రజలాలపై నిఘా సామర్థ్యం మరింతగా పెరుగుతుందని భారత్‌ తెలిపింది.  కొలంబో సమీపంలోని కతునాయకే వైమానిక స్థావరంలో ఆగస్టు 15వ తేదీన (సోమవారం) ఆ దేశాధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘే అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భారత నేవీ వైస్‌ చీఫ్‌ గోర్మండే, శ్రీలంకలో భారత హై కమిషనర్‌ గోపాల్‌ బాగ్లే ఈ విమానాన్ని అందజేశారు.

Published date : 17 Aug 2022 04:07PM

Photo Stories