Indira Gandhi Peace prize 2023: బోయిమ్, అవ్వాద్లకు ఇందిరా గాంధీ శాంతి బహుమతి
Sakshi Education
ఇజ్రాయెల్–పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనడంలో కృషి సాగిస్తున్న డేనియల్ బరెన్బోయిమ్, అలీ అబు అవ్వాద్లకు 2023 సంవత్సరం ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు.
Barenboim and Awwad win Indira Gandhi Peace prize 2023
అర్జెంటినాలో జన్మించిన సంగీత కళాకారుడు బరెన్బోయిమ్, పాలస్తీనాకు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు.
వీరిద్దరికీ కలిపి సంయుక్తంగా ఇందిరాగాంధీ శాంతి, నిరాయుదీకరణ, సామాజికాభివృద్ధి బహుమతిని ప్రదానం చేసినట్లు కమిటీ జ్యూరీ చైర్మన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ చెప్పారు. వీరిద్దరూ మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు కృషి సాగిస్తున్నారని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రశంసించింది.