Skip to main content

Dr Angamuthu: యువత ఉపాధి శిక్షణకు పోర్టు సాయం

సాక్షి, విశాఖపట్నం : యువతను ప్రోత్సహించడంలో విశాఖపట్నం పోర్టు అథారిటీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని వీపీఏ చైర్మన్‌ డా.అంగముత్తు తెలిపారు.
Encouraging Youth Initiatives at Visakhapatnam Port    Visakhapatnam Port Authority Supports Youth Development  Port assistance for youth employment training    VPA Chairman Dr. Angamuthu at Visakhapatnam Port Authority

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన దినోత్సవాన్ని పోర్టులో జ‌నవ‌రి 12న‌ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.64.38 లక్షల చెక్కును సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మారీటైమ్‌ అండ్‌ షిప్‌బిల్డింగ్‌(సెమ్స్‌) అధికారులకు అందజేశారు. ఈ నిధులతో కొరియర్‌ సూపర్‌ వైజర్‌ ఆపరేషన్స్‌, వేర్‌ హౌస్‌ ఎగ్జిక్యూటివ్‌, వేర్‌ హౌస్‌ పికర్‌, ఇన్వెంటరీ కంట్రోలర్‌ , సీఎన్‌సి ఆపరేటర్‌, వెర్టికల్‌ మెషీనింగ్‌ సెంటర్‌, ఎంఎంఏడబ్యూ, స్వామ్‌ వెల్డర్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రిషియన్‌ తదితర కోర్సులలో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు వినియోగిస్తామని సెమ్స్‌ అధికారులు తెలిపారు.

చదవండి: Mega Job Mela: జాబ్‌మేళా ద్వారా నిరుద్యోగులకు ఉపాధి

శిక్షణా కాలం మూడు నెలల పాటు ఉంటుందని పోర్టు చైర్మన్‌ తెలిపారు. సెమ్స్‌తో కలిసి విశాఖపట్నం పోర్టు అథారిటీ నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని పోర్టు చైర్మన్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోర్టు డిప్యూటీ చైర్మన్‌ దుర్గేష్‌ కుమార్‌ దూబె, ఎఫ్‌ఏ అండ్‌ సీఏఓ శరగడం శివకుమార్‌ , సెమ్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Published date : 13 Jan 2024 03:56PM

Photo Stories