Skip to main content

ITDA PO Ankit: యువతకు నాణ్యమైన శిక్షణ ఇవ్వాలి

ఏటూరునాగారం: నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ ఇవ్వాలని ఐటీడీఏ పీఓ అంకిత్‌ ఆదేశించారు.
Youth should be given quality training
యువతకు నాణ్యమైన శిక్షణ ఇవ్వాలి

అక్టోబ‌ర్ 6న‌ ములుగు మండలంలోని జాకారం యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో షెడ్యూల్డ్‌ తెగల నిరుద్యోగ అభ్యర్థులకు రెసిడెన్షియల్‌ మోడ్‌లో నెట్‌వర్క్‌ అసోసియేట్స్‌ కోర్సును తనిఖీ చేశారు. అభ్యర్థుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, కొంత మంది విద్యార్థులు గైర్హాజరుకు గల కారణాలపై సెంటర్‌ ఇన్‌చార్జ్‌ ఉమతో ఆరా తీశారు. తిరిగి కేంద్రానికి తీసుకొచ్చేందుకు వారితో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

చదవండి: Police Jobs 2023 : ఒకే కుటుంబం.. ఒకేసారి ముగ్గురు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు కొట్టారిలా.. ఎక్క‌డంటే..

సబ్జెక్టుల బోధనపై ఫ్యాకల్టీ, మొబిలైజర్‌లు ఎలా బోధన చేస్తున్నారని ప్రశ్నించారు. వివిధ కంపెనీల్లో ప్లేస్‌మెంట్‌ల కోసం ప్రణాళిక చేయడం, సిస్టమ్‌లపై క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు ప్రతి సబ్జెక్టుపై నాణ్యమైన థీమ్‌లను అందించాలని కోరారు. కోర్సు అభ్యర్థులకు అధ్యాపకులు బోధిస్తున్న తీరును పరిశీలించారు.

అభ్యర్థులు ఇప్పటి వరకు నేర్చుకున్న నైపుణ్యాలు, రోజువారీ కార్యకలాపాలు, భవిష్యత్‌లో కోర్సు ఉపయోగపడుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఫ్యాకల్టీతో సిస్టం నిర్వహణను తరచుగా నిర్వహించాలన్నారు. నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని సూచించారు.

Published date : 07 Oct 2023 03:13PM

Photo Stories