Award: బడిపిల్లల సాహిత్యానికి రాష్ట్రస్థాయి పురస్కారం
Sakshi Education
సిరిసిల్ల కల్చరల్: పసివయసులోనే సాహిత్య అభిలాష పెంచేందుకు జరిగిన ప్రయత్నానికి మంచి ప్రోత్సాహం లభించింది.
బడిపిల్లల సాహిత్యానికి రాష్ట్రస్థాయి పురస్కారం
జిల్లాకేంద్రానికి చెందిన బడిపిల్లలు వెలువరించిన ‘సిరిసిల్ల సిరిమల్లెలు’పుస్తకానికి రాష్ట్రస్థాయి పురస్కారం వరించింది. శివనగర్లోని కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్ కు చెందిన చిన్నారులు కథలు, కవితలు, కథానికలు, వ్యాసాల రూపాల్లో రాసిన అంశాలన్నింటినీ పుస్తకంగా రూపొందించారు. పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి చిన్నారులు ఆశీర్వదించారు.
తాజాగా ఈ సాహిత్యసంపుటికి రాష్ట్రస్థాయి చింతోజు బ్రహ్మయ్య బాలమణి స్మారక పురస్కారం వరించింది. ఉత్తమ కవితాసంకలనం విభాగంలో ‘సిరిమల్లెలు’ఎంపికైందని పురస్కార కమిటీ జ్యూరీ సభ్యులు డాక్టర్ చింతోజు రాజారాం, శంకర్, నారాయణ, ప్రొఫెసర్ మారోజు దేవేంద్ర ప్రకటించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు పరబ్రహ్మమూర్తి, కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్ చిన్నారులను అభినందించారు.