Skip to main content

Admissions: ‘ప్రైవేట్‌’లో ఉచిత విద్యకు ఇంత మందికి అవకాశం

సాక్షి, అమరావతి: ఉచిత విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు మరో 3,023 మంది చిన్నారులను ఎంపిక చేశారు.
Admissions
‘ప్రైవేట్‌’లో ఉచిత విద్యకు ఇంత మందికి అవకాశం

మొదటి విడతలో తొలి జాబితాగా 9,064 మంది ఎంపికయ్యారు. ఇదే విడతలో అర్హత సాధించిన విద్యార్థుల రెండో జాబితాను మే 3న ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు. మొదటి విడతలో మిగిలిన సీట్లకు  లాటరీ తీయగా 3,023 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

చదవండి: Virtual Reality: ‘నెట్‌’స్పీడైతే.. బోధన ‘వీఆర్‌’అవుద్ది!

ఆ జాబితాను అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లకు పంపించారు. విద్యార్థులకు కేటాయించిన పాఠశాలల్లో మే 9 లోపు చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు మే 6–15 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

చదవండి: PM SHRI: ఆ స్కూళ్ల బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపండి

Published date : 04 May 2023 03:58PM

Photo Stories