Skip to main content

భారతీయ భాషలతోనే పాలన

పరిపాలన భాషగా భారతీయ భాషలే ఉండాలని, మాతృ భాషే ఏ రాష్ట్రానికైనా పాలన భాష కావాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
venkaiah naidu
భారతీయ భాషలతోనే పాలన

ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రాంతీయ భాషల్లోనే జరగాలని ఆయన ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 36వ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 12న జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వలస పాలకులు మన భాషపై ముందుగా దాడి చేశారని, వారి భాషలను బలవంతంగా మనపై రుద్దారన్నారు. భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను అర్థం చేసుకుని ఉమ్మడిగా జీవించడమే నిజమైన విద్యని పేర్కొన్నారు. తనతో సహా దేశంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారంతా తెలుగులోనే చదువుకున్నారని తెలిపారు.

చదవండి: 

Venkaiah Naidu: అరుణాచల్‌లో ఉపరాష్ట్రపతి పర్యటనపై అభ్యంతరం తెలిపిన దేశం?

Dadasaheb Phalke Award: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు

Koya tribe language: కోయ భాషలో విద్యాబోధన అభినందనీయం

Published date : 13 Dec 2021 03:11PM

Photo Stories