Skip to main content

History Researcher: చరిత్ర పరిశోధకునికి తెలుగు విశ్వవిద్యాలయం అందించిన పురస్కారం

తాను చేసిన చరిత్ర పరిశోధనకు ఇప్పటికే ఎన్నో పురస్కారలను అందుకున్న సిరిసిల్లా వాసి ఈయన. అటువంటిది, ఏటా పురస్కారాలను అందించే తెలుగు విశ్వవిద్యాలయంలో తనకంటూ ఒక పురస్కారం దక్కించుకున్నారు.
Srinivasa Raju receiving the fame award at Potti Sriramulu Telugu University

 

సిరిసిల్లకల్చరల్‌: జిల్లాకు చెందిన చరిత్ర పరిశోధకుడు డాక్టర్‌ చెన్నమాధవుని శ్రీనివాసరాజు మరో పురస్కారం అందుకున్నారు. వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా అందించే కీర్తి పురస్కారాల్లో భాగంగా జిల్లా వాసి సి.శ్రీనివాసరాజును పరిశోధన విభాగంలో ఎంపిక చేసింది. బుధవారం వర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో తిక్కవరపు రామిరెడ్డి స్మారక పురస్కారాన్ని అందజేసింది. వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ తంగెడ కిషన్‌రావు, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Retired Professors: విధుల్లోకి రిటైర్డ్‌ ప్రొఫెసర్లు.. కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియామకానికి నోటిఫికేషన్‌

శ్రీనివాస్‌రాజు 'చరిత్ర'..

శ్రీనివాసరాజు స్వస్థలం బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి. చరిత్ర పరిశోధన సమితిని స్థాపించారు. చారిత్రక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించి అనేక విశేషాలను వెలుగులోకి తెస్తున్నారు. ఈ క్రమంలో బహదూర్‌ కొండలరాయుడు నవల, భరతావని అనే కావ్యం, చక్రేశ్వరిదేవి, బొమ్మలమ్మగుట్ట శతకం, ప్రిన్సెస్‌ యశోధర అనే చారిత్రక నాటకం, ముసునూరి కాపయ నాయకుడు నవల, అన్‌బీటెన్‌ ఎంపైర్‌ పేరిట వేములవాడ చరిత్ర, కెప్టెన్‌ రఘునందన్‌ జీవిత చరిత్ర, హిస్టరీ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, మానవ జీవన పరిరక్షణ పేరిట కవితలు వెలువరించారు.

Published date : 22 Mar 2024 11:06AM

Photo Stories