కాచిగూడ: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో నవంబర్ 14న మీడియాతో ఆయన మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినందున జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో, కేంద్రంలో 27% నుంచి 56 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.