ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిలాలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజుల పెంపుదల అంశాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కళాశాల కరస్పాండెంట్ పీఎల్ఎన్ రెడ్డి చెప్పారు.
ఎస్ఎస్బీఎన్ కాలేజీలో ఫీజుల పెంపు నిర్ణయం రద్దు
కళాశాలలో నవంబర్ 9న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎయిడెడ్ తరహాలో గతేడాది కట్టినట్లే ఈ విద్యా సంవత్సరంలోనూ ఫీజులు చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. ఎయిడెడ్ లెక్చరర్లు 13 మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు వెళ్లిపోయారని, వారిని వెనక్కి రప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. వారందరూ తిరిగివస్తే.. ఎయిడెడ్ను పునరుద్ధరిస్తామన్నారు.