Skip to main content

NMMS: ఎన్‌ఎంఎంఎస్‌ ఫలితాల విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 5న జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌) ఫలితాలు విడుదలైనట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి జూన్‌ 2న తెలిపారు.
NMMS
ఎన్‌ఎంఎంఎస్‌ ఫలితాల విడుదల

విద్యార్థులు డీఈవో కార్యాలయంలో, www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికైన విద్యార్థుల మెరిట్‌కార్డులను త్వరలో డీఈవో కార్యాలయాలకు పంపించనున్నారు. జాతీయ విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికైన విద్యార్థులు (వారి ఆధార్‌ అనుసంధానంతో) జాతీయ బ్యాంకులో తల్లి/తండ్రితో కలిసి జాయింట్‌ సేవింగ్స్‌ అకౌంటు తీసుకోవాలి. మెరిట్‌ కార్డులో ఉన్న విధంగానే ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌ పుస్తకంలో విద్యార్థి వివరాలు ఉండాలి.

చదవండి:

ఈ ప‌థ‌కానికి ఎంపికైతే... ఏడాదికి రూ.12000 అంద‌జేత

ఎన్‌ఎంఎంఎస్,ఎన్‌టీఎస్‌ఈ పరీక్షలకు ప్రిపరేషన్ గెడైన్స్...

Published date : 03 Jun 2023 03:34PM

Photo Stories