బీసీ గురుకుల కాలేజీల్లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
ఇంటర్మిడియట్, డిగ్రీ మొదటి సంవత్సరం(మహిళలు)లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు సొసైటీ వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్ పద్ధ తిలో దరఖాస్తును మే 22వ తేదీలోగా సమరి్పంచాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు మే 9న ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 5న అర్హతపరీక్ష నిర్వహిస్తామని, మెరిట్, రిజర్వేషన్ల ఆధారం గా అడ్మిషన్లు ఇస్తామని పేర్కొన్నారు. ఇంటర్ ఫస్టియర్లో చేరే విద్యార్థులు ప్రభుత్వగుర్తింపు పొందిన పాఠశాలలో 2021–22లో 10వ తర గతి చదివి ఉండాలని, డిగ్రీ ఫస్టియర్లో చేరే విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలలో 2021–22లో ఇంటర్మిడియ ట్ పూర్తిచేసి ఉండాలని పేర్కొన్నారు. విద్యా ర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలోని వారైతే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతంలోని వారైతే రూ.2 లక్షలకు మించకూడదన్నారు. మరిన్ని వివరాలు, దరఖాస్తు చేయడం కోసం mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ను చూడాలని, సందేహాలుంటే 040–2332 2377, 2332 8266 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.