Skip to main content

Scholarships: త్వరలో స్కాలర్‌షిప్‌ బకాయిలిస్తాం

పెండింగ్‌లో ఉన్న మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్పులు, ఫీజు రియిబర్స్‌మెంట్‌ నిధులను త్వరలో విడుదల చేస్తామని తెలంగాణ మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హామీ ఇచ్చారు.
Scholarships
త్వరలో స్కాలర్‌షిప్‌ బకాయిలిస్తాం

‘9,23,700 మంది విద్యార్థులకు త్వరలో పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్పులను విడుదల చేస్తాం. రూ.1,372 కోట్ల ఫీజులను సైతం చెల్లిస్తాం. సీఎం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కొంతమంది మైనారిటీ విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. త్వరలోనే విడుదల చేస్తాం. ఇప్పటివరకు 2,235 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.323.29 కోట్ల స్కాలర్‌షిప్పులను ఇచ్చాం. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు దారులకు చెల్లించాల్సిన స్వయం ఉపాధి పథ కాల రుణాలు కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై త్వరలో నిర్ణయం తీసుకుం టాం’ అని కొప్పుల చెప్పారు.

Published date : 05 Oct 2021 04:55PM

Photo Stories