Skip to main content

Scholarships: 21 వేల మంది విద్యార్థినులకు ఈ ఉపకార వేతనాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ వజ్ర స్వర్ణాభరణాల తయారీ విక్రయ సంస్థ మలబార్‌ గ్రూప్‌ దేశవ్యాప్తంగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద 21 వేలమంది విద్యార్థినులకు 2024 ఏడాదికి గాను రూ.16కోట్ల ఉపకారవేతనాలను ప్రకటించింది.
Malabar Group scholarships for 21 thousand female students

ఇటీవల ముంబైలోని భారత్‌ డైమండ్‌ బౌర్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్, మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహ్మద్, మలబార్‌ గ్రూప్‌ ఎండీ (భారత్‌) ఆషర్‌ ఓ, సంస్థ వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ సలామ్‌ కేపీ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Scholarship Program: పీఎం స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం.. ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి

ఈ సందర్భంగా ఎంపీ అహ్మద్‌ మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చగలిగే చోదక శక్తి కేవలం విద్య మాత్రమేనన్నారు. విద్యలో బాలికలు ప్రతిభ కనబరుస్తూ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోకుండా ఉండేందుకు కొంతైనా సాయపడాలనే ఈ ఉపకారవేతనాలను ప్రకటించామని చెప్పారు. బాలికలు చదువులో రాణించడం ద్వారా మహిళా సాధికారతను సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. 

Published date : 02 Oct 2024 04:29PM

Photo Stories