Skip to main content

సరికొత్త ఆవిష్కరణలు చేపట్టాలని విద్యార్థులకు గవర్నర్‌ సూచన

అక్టోబర్‌ 27న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.
సరికొత్త ఆవిష్కరణలు చేపట్టాలని విద్యార్థులకు గవర్నర్‌ సూచన
సరికొత్త ఆవిష్కరణలు చేపట్టాలని విద్యార్థులకు గవర్నర్‌ సూచన

ఉస్మానియాలో చదివిన విద్యార్థులు దేశంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జీవితానికి విజయ సూచిక అని పేర్కొన్నారు. వర్సిటీని వీడి వాస్తవ జీవితంలోకి వెళ్తున్న విద్యార్థులకు సమాజమే ప్రయోగశాల అని చెప్పారు. ఓయూ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గర్వించేలా ఉండాలని సూచించారు. పరిశోధనలతో సరికొత్త ఆవిష్కరణలను చేపట్టాలన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న లక్ష్యం దిశగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. మీ జీవితాలు తెల్లకాగితం లాంటివి అందులో ఎలా రాసుకుంటే అలా భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం కెమిస్ట్రీలో 5బంగారు పతకాలు సాధించిన ఎస్‌.సుశాంత్, 4 బంగారు పతకాలు సాధించిన మహేష్కర్, గోల్డ్‌మెడల్స్‌ సాధించిన ఇతరులను అభినందించి పతకాలు అందజేశారు. కార్యక్రమంలో వీసీ ప్రొ.రవీందర్, రిజి్రస్టార్‌ లక్ష్మీనారాయణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

చదవండి: 

DRDO Chairman: ఎందరో ప్రముఖులను అందించిన విశ్వవిద్యాలయం

NEET UG 2021 Result : ఫలితాల ప్రకటనకు సుప్రీం కోర్టు అనుమతి

Published date : 28 Oct 2021 05:08PM

Photo Stories