Skip to main content

Fee Reimbursement: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

భానుపురి (సూర్యాపేట) : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.8300 కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి డిమాండ్‌ చేశారు.
Fee reimbursement should be released

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆగ‌స్టు 23న‌ సూర్యాపేట పట్టణంలోని 100 ఫీట్ల రోడ్డు నుంచి గాంధీ విగ్రహం వరకు పీడీఎస్‌యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో సింహాద్రి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యాశాఖకు మంత్రిని కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాన్నారు. పీడీఎస్‌యూ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్‌, మమత, సంధ్య, నవ్య, శైలజ, వనజ, శివ, సందీప్‌, మహేష్‌, నవీన్‌, వినయ్‌, వేణు, సాయిరాం, ఉదయ్‌, గోపి పాల్గొన్నారు.
చదవండి: TS Fee Reimbursement 2024 Update : ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఏమ‌న్నారంటే..?

Published date : 24 Aug 2024 02:08PM

Photo Stories