MJPAPBCWREIS: బీసీ గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని పాఠశాలల్లో 6,7,8 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి మే 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
బీసీ గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..
రాష్ట్ర వ్యాప్తంగా 295 పరీక్షా కేంద్రాల్లో ఉద యం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట ల వరకు పరీక్ష జరుగుతుందని సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు మే 5న ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సొసైటీ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ మూడు తరగతుల్లో రాష్ట్రవ్యాప్తంగా 5,175 ఖాళీలున్నాయని తెలిపారు.