Skip to main content

‘డబుల్‌ ధమాకా’ పుస్తకావిష్కరణ

సాక్షి దినపత్రిక ఫ్యామిలీ పేజీలో 100 వారాల పాటు ఏకధాటిగా సాగిన పాపులర్‌ ఇంటర్వూ్యల శీర్షిక ‘డబుల్‌ ధమాకా’ పుస్తకం రూపంలో వెలువడింది.
Book
‘డబుల్‌ ధమాకా’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్, భారతి దంపతులు, చిత్రంలో.. ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల, జర్నలిస్‌్ట ఇందిర పరిమి తదితరులు

సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతిలు డిసెంబర్‌ 17న తాడేపల్లిలోని సీఎం నివాసంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. సినిమా, సాహిత్యం, రాజకీయం, నృత్యం, సంగీతం, క్రీడలు, టీవీ, సమాజం.. ఇలా వివిధ రంగాల్లో ఇద్దరేసి ప్రముఖులను కూర్చోబెట్టి జర్నలిస్టు ఇందిర పరిమి చేసిన ప్రత్యేక ఇంటర్వూ్యల సమాహారమే ఈ పుస్తకం. ఎమెస్కో పబ్లికేష¯Œ్స దీనిని ప్రచురించింది. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సతీమణి లక్ష్మి సజ్జల, ఎమెస్కో విజయ్‌కుమార్, జర్నలిస్ట్‌ ఇందిర పరిమి తదితరులు పాల్గొన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ దంపతులు, ఇతర ప్రముఖులు.. ఇందిర పరిమి ప్రయత్నాన్ని అభినందించారు. 

చదవండి: 

Gaurishankar: చదువే కాదు.. సాహిత్యమూ ముఖ్యమే

Formula One: నైట్‌హుడ్‌ పురస్కారం పొందిన రేసింగ్‌ డ్రైవర్‌?

Published date : 18 Dec 2021 03:13PM

Photo Stories