సాక్షి, అమరావతి: డిగ్రీ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ మే నెల లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని కోరినట్లు జీసీటీఏ అధ్యక్షుడు రాఘవరెడ్డి తెలిపారు.
డిగ్రీ ప్రవేశాలు ఈ లోపు పూర్తి చేయాలి
జూన్ ఫస్ట్ నుంచి తరగతులు ప్రారంభించాలని, అధ్యాపకులకు ఒకసారి ఇంటర్ జోనల్ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ సంఘం గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్ల సంఘం జేఏసీ నాయకులు మార్చి 6న ఓ ప్రకటన విడుదల చేశారు.