కొత్తగూడెంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ Medical Collegeకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి
ఈ మేరకు National Medical Commission (NMC) ఆగస్టు 24న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. 2022–23లో కొత్తగా జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటిల్లో ఇటీవలే జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్కర్నూల్ మెడికల్ కాలేజీలకు అనుమతులిచ్చింది. మహబూబాబాద్, మంచిర్యాల, రామగుండం మెడికల్ కాలేజీలకు అనుమతి రావాల్సి ఉంది. కొత్తగూడెం కాలేజీకి అనుమతి రావడం పట్ల తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.