మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ ఉపకారవేతనాలు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ సెప్టెంబర్ 9న ప్రకటన విడుదల చేసింది.
‘మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తులు
ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కేటగిరీలో నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పోస్టుమెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ కోసం నవంబర్ 30వ తేదీలోగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.