Nursing Colleges: రాష్ట్రంలో కొత్తగా 3 నర్సింగ్ కళాశాలలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరుల్లో కొత్తగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఏప్రిల్ 26న ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో కొత్తగా 3 నర్సింగ్ కళాశాలలు
దేశంలో నర్సింగ్ నిపుణుల సంఖ్యను పెంచేందుకు 157 కొత్త నర్సింగ్ కళాశాలలు నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ఏపీకి మూడు కళాశాలలను కేటాయించింది. ఈ మూడుచోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తోంది.