సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి యూపీఎస్సీ తుది ఫలితాల్లో తొలి 20స్థానాల్లో నిలిచిన టాపర్లను కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఘనంగా సత్కరించారు.
సివిల్స్ టాపర్లకు కేంద్రమంత్రి సత్కారం
నార్త్బ్లాక్లోని కార్యాలయంలో మే 30న జరిగిన సత్కార కార్యక్రమంలో జితేంద్రసింగ్ టాపర్లతో మాట్లాడారు. టాప్ 20 అభ్యర్థుల్లో 12 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉండగా తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఇషితా కిశోర్, గరిమా లోహియా, తెలంగాణకు చెందిన ఉమాహారతిలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.