Andhra Pradesh : సీఎం జగన్ను కలిసిన ఐఏఎస్ ప్రొబేషనర్స్.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఐఏఎస్ ప్రొబేషనర్లు (ఏపీ క్యాడర్ అసిస్టెంట్ కలెక్టర్స్ అండర్ ట్రైనింగ్ 2022 బ్యాచ్) 10 మంది సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
AP CM YS Jagan Mohan Reddy With IAS Probationers Officers
![IAS probationers call on CM YS Jagan Mohan Reddy](/sites/default/files/images/2023/06/27/ias-ap-cm-ys-jagan-1-1687871356.jpg)
ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేయాలని.. సామాన్యులకు అందుబాటులో ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా వారికి మార్గనిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో..
![ap cm ys jagan mohan reddy with ias today news telugu](/sites/default/files/inline-images/ap%20cm%20ys%20jagan%202%20ias.jpg)
సీఎంను కలిసిన వారిలో ఐఏఎస్ ప్రొబేషనర్లు బి.స్మరణ్రాజ్(అనకాపల్లి జిల్లాకు అలాట్మెంట్), బి.సహదిత్ వెంకట్ త్రివినాగ్(విజయనగరం), సి.యశ్వంత్కుమార్రెడ్డి(తూర్పుగోదావరి), కల్పశ్రీ కే.ఆర్(పల్నాడు), కుషల్ జైన్(అనంతపురం), మంత్రి మౌర్య భరద్వాజ్(వైఎస్సార్), రాఘవేంద్ర మీనా(శ్రీకాకుళం), సౌర్యమన్ పటేల్(ప్రకాశం), తిరుమణి శ్రీ పూజ(ఏలూరు), వి.సంజనా సింహ(ఎస్పీఎస్ఆర్ నెల్లూరు)తో పాటు ఏపీ హెచ్ఆర్డీ డీజీ ఆర్పీ సిసోడియా, ఏపీ హెచ్ఆర్డీ జేడీజీ పి.ఎస్.ప్రద్యుమ్న తదితరులున్నారు.
☛ UPSC Civils Results 2022: పరీక్ష రాయలేని స్మరణ్ను.. అమ్మ గెలిపించిదిలా.. గంటకు 40 పేజీలు..
Published date : 27 Jun 2023 06:39PM