Skip to main content

త్రివిధ దళాలల్లో ‘ఆఫీసర్’ స్థాయి కొలువు సాధించే మార్గాలు..

దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా! యుద్ధ విమానాలతో ఉగ్ర మూకల పీచమణిచే తెగువ మీలో ఉందా!! కడలిపై నుంచి శత్రువులకు సవాలు విసిరే సాహసం మీ సొంతమా..!?...ఉత్సాహం ఉరకలెత్తే యువతకు త్రివిధ దళాల్లో ఆఫీసర్ కేడర్‌లో అవకాశం కల్పించే.. కంబైన్‌‌డ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ)(I)-2020కు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతిఏటా రెండుసార్లు నిర్వహించే సీడీఎస్‌ఈ పరీక్షలో ప్రతిభ ద్వారా త్రివిధ దళాలైన మిలటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఉన్నత హోదాతో కెరీర్‌ను సొంతం చేసుకునే సువర్ణ అవకాశం లభిస్తుంది. సీడీఎస్‌ఈ పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ గెడైన్స్ మీకోసం...
ఖాళీలు:
ఇండియన్ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్): 100
ఇండియన్ నావల్ అకాడమీ (ఎజిమలా): 45
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్): 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (పురుషులు): 225
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(చెన్నై) (మహిళలు): 16

మొత్తం ఖాళీలు:
418
అర్హతలు: ఇండియన్ మిలటరీ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు:
మిలిటరీ అకాడమీ:
1997 జనవరి 2- 2002 జనవరి 1 మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి 1996 జనవరి 2 - 2002 జనవరి 1 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులు. మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • నావల్ అకాడమీకి గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
    వయసు: 1997 జనవరి 2 - 2002 జనవరి 1 మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు.
  • ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
    వయసు: 1997 జనవరి 2 - 2001 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉన్నవారికి రెండేళ్ల సడలింపు ఉంటుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
  • విద్యార్హత చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే త్రివిధ దళాల్లో కోర్సు ప్రారంభానికి ముందు ఉత్తీర్ణత పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌కు మొదట ప్రాధాన్యం ఇచ్చే వారు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ సమయానికి ప్రొవిజినల్ సర్టిఫికెట్ చూపాల్సి ఉంటుంది.
  • మహిళా అభ్యర్థులు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే అర్హులు.

ఎంపిక ఇలా..
ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలుత దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరవ్వాలి. ఇది అన్ని విభాగాల అభ్యర్థులకు కామన్‌గా అయిదు రోజులపాటు జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆరు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ దశలో వేర్వేరు రకాల పరీక్షలు నిర్వహించి ఆఫీసర్ ఉద్యోగాలకు సరిపోతారా లేదా అని పరీక్షిస్తారు.

రాత పరీక్ష విధానం :
రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలోని రాత పరీక్షలో రుణాత్మక మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు.

ఇండియన్ మిలటరీ,నావల్,ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కోర్సుల..పరీక్ష స్వరూపం :

సబ్జెక్ట్

వ్యవధి

మార్కులు

ఇంగ్లిష్

2 గంటలు

100

జనరల్ నాలెడ్‌‌జ

2 గంటలు

100

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్

2 గంటలు

100


ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ:

సబ్జెక్ట్

వ్యవధి

మార్కులు

ఇంగ్లిష్

2 గంటలు

100

జనరల్ నాలెడ్జ్

2 గంటలు

100


  • ప్రశ్నల క్లిష్టత ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టులకు గ్రాడ్యుయేషన్ స్థాయిలో, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌కు పదో తరగతి స్థాయిలో ఉంటుంది.

ఎస్‌ఎస్‌బీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ:
  • ఎస్‌ఎస్‌బీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులో భాగంగా మొదటి రోజు సీ్ర్కనింగ్ టెస్టు నిర్వహిస్తారు. ఇదే స్టేజ్-1 టెస్ట్. ఇందులో అర్హత సాధిస్తే స్టేజ్-2కు అనుమతిస్తారు. స్టేజ్-1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్(ఓఐఆర్) టెస్ట్‌లు ఉంటాయి. విద్యార్థులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. వీరికి పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లు(పీపీ అండ్ డీటీ) నిర్వహిస్తారు. ఇక్కడ బ్లర్ అయిన ఫోటో ఒకటి కనిపిస్తుంది, దాన్ని చూసి అర్థం చేసుకున్న విషయాన్ని కథలా రాయాల్సి ఉంటుంది. దాన్నే బోర్డు సభ్యుల ముందు వివరించాలి. ఆ తర్వాత బృంద సభ్యులంతా కలిసి ఫోటో మీద రాసిన కథనాన్ని చర్చించి.. దానికో ముగింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దశలో ఎంపికకాని కొంతమంది విద్యార్థులను ఇంటికి పంపిస్తారు.
  • స్టేజ్-2లో సైకాలజీ టెస్ట్‌లు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్కులు, ఇంటర్వ్యూ, కాన్ఫరెన్సులు ఉంటాయి. వీటిని నాలుగు రోజులకు పైగా నిర్వహిస్తారు. సైకాలజీ టెస్టుల్లో థెమటిక్ పర్సప్షన్ టెస్ట్ (టీఏటీ) ఉంటుంది. ఇక్కడ 11 ఫోటోల స్లైడ్ షో ఉంటుంది. ప్రతి ఫోటో 30 సెక్షన్ల పాటు వచ్చిపోతుంది. దానిపై 4 నిమిషాల వ్యవధిలో స్టోరీ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వర్డ్ అసోసియేషన్ టెస్ట్ (డబ్ల్యూఏటీ), సిట్యువేషన్ రియాక్షన్ టెస్ట్(ఎస్‌ఆర్‌టీ)ల ద్వారా విద్యార్థుల సమయస్ఫూర్తి పరీక్షిస్తారు. డబ్ల్యూఏటీలో ఒక్కో పదాన్ని 15 సెకన్ల పాటు చూపించి.. దానిపై స్పందన రాయమంటారు. తుదిగా సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్ (ఎస్‌డీ)లో అభ్యర్థి తన కుటుంబం, స్నేహితులు, కాలేజీ, ఉపాధ్యాయులు, తన గురించి రాయాల్సి ఉంటుంది. ఈ టెస్టుల అనంతరం రెండు రోజుల పాటు 9 రకాల గ్రూప్ టాస్కులు ...జీడీ, గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్‌సెజైస్, ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్, గ్రూప్ అబ్‌స్టాకిల్ రేస్, హాఫ్ గ్రూప్ టాస్క్, లెక్చురెట్టె(ఇచ్చిన టాపిక్స్‌లో ఒకదాన్ని ఎంచుకొని మూడు నిమిషాలు పాటు మాట్లాడాలి), ఇండివిడ్యువల్ ఆబ్‌స్టాకిల్స్, కమాండ్ టాస్క్, ఫైనల్ గ్రూప్ టాస్క్ ఉంటాయి.
  • వీటన్నింటి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. బోర్డ్ ప్రెసిడెంట్ లేదా సీనియర్ సభ్యుడు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది 35 నుంచి 40 నిమిషాలపాటు జరుగుతుంది. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు వెళ్లగానే విద్యార్థి పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చనరీ(పీఐక్యూ) ఫాం నింపుతారు. దాని ఆధారంగా ఇంటర్వ్యూ సాగుతుంది. తుదిగా కాన్ఫరెన్స్ ఉంటుంది. ప్యానెల్‌లో ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్స్, సైకాలజిస్టులు ఉంటారు. వీరి ముందు విద్యార్థులు వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లైయింగ్ బ్రాంచీ వారికి పీఏబీటీ ఉంటుంది. రికమెండ్ చేసిన విద్యార్థులకు శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్టు ప్రకటిస్తారు.

పిపరేషన్టిప్స్:
ఇంగ్లిష్ :

అభ్యర్థుల ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం ఇది. ఇందులో ముఖ్యంగా వొకాబ్యులరీ, ఇంగ్లిష్ అర్థం చేసుకునే నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునే విధంగా ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు ఉండే ఈ పేపర్‌లో 120 ప్రశ్నలు వస్తున్నాయి. సెంటెన్స్ లో పదాల జంబ్లింగ్ ఇస్తారు. వాటి సరైన క్రమాన్ని కనుగొనాలి. స్పాటింగ్ ఎర్రర్స్; సెంటెన్స్ ఆర్డరింగ్; సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్; రీడింగ్ కాంప్రహెన్షన్; ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.

జనరల్ నాలెడ్జ్ :
120 ప్రశ్నలు ఉండే ఈ సెక్షన్‌కు 100 మార్కులు కేటాయించారు. ఇందులో కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర అన్ని అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. డిఫెన్స్ కు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు, ప్రాముఖ్యం ఉన్న అంశాలు, అవార్డులు, జాయింట్ మిలిటరీ ఎక్సెర్‌సెజైస్-సంయుక్త దేశాలు, వాటి పేర్లు మొదలైన వాటిని తెలుసుకోవడం మేలు. కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి గత ఆరు నెలల నుంచి అంతర్జాతీయంగా, జాతీయంగా చోటు చేసుకున్న ముఖ్యమైన అంశాలను చదవాలి.

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ :
ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి మినహా మిగతా పోస్టులకు మ్యాథమెటిక్స్ విభాగం ఉంటుంది. 100 ప్రశ్నల-100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. నంబర్ సిస్టమ్, ఎలిమెంటరీ నంబర్ థియరీ, అర్థమెటిక్, జామెట్రీ, మెన్సురేషన్, ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, స్టాటిస్టిక్స్ అధ్యయాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యర్థులు పదో తరగతి స్థాయి పుస్తకాలు చదివితే ఈ విభాగానికి పూర్తి స్థాయి సన్నద్ధత లభిస్తుంది.

ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:
2019, నవంబర్ 19
దరఖాస్తుల ఉపసంహరణ తేదీలు: 2019, నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు
దరఖాస్తు రుసుం: రూ.200(ఎస్సీ/ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రుసుం లేదు)
రాత పరీక్ష తేది: 2020, ఫిబ్రవరి 2
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://upsc.gov.in  
Published date : 12 Nov 2019 06:19PM

Photo Stories