Skip to main content

RGUKT-AP: ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు..

రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్‌జీయూకేటీ) ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలుల్లోని క్యాంపస్‌ల్లో.. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాల దరఖాస్తులకు గడువు జూన్‌ 26వ తేదీన ముగియనుంది. విద్యార్థులు ఏదైనా ఏపీ ఆన్‌లైన్‌ సెంటర్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
6-year integrated b.tech course details

అర్హత
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2023లో పదో తరగతి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

సీట్లు
ఆర్కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలుల్లోని క్యాంపస్‌లలో 1000 సీట్ల చొప్పున మొత్తం నాలుగు క్యాంపస్‌లలో 4000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ప్రతి క్యాంపస్‌లో 100 (10%) చొçప్పున 400 అదనపు సూపర్‌న్యూమరీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 4400 సీట్లలో 85% ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు, 15 శాతం సీట్లను ప్రతిభ ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులకు (నాన్‌ లోకల్‌) ఓపెన్‌ కేటగిరీలో ఎంపిక చేస్తారు.

చ‌ద‌వండి: Integrated B.Tech Courses After 10th: పదితోనే.. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. మ్యాథ్స్‌ మార్కులు ముఖ్యం

ప్రవేశ విధానం
పదో తరగతిలో విద్యార్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఒక వేళ విద్యార్థులకు సమాన మార్కులు వస్తే మొదట గణితంలో ఎక్కువ మార్కులు సాధించినవారిని, తర్వాత జనరల్‌ సైన్స్, ఇంగ్లిష్, సోషల్‌ స్టడీస్, మొదటి లాంగ్వేజ్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చే­స్తారు. అన్నింటిలోనూ సమానమైన మార్కులు వస్తే పుట్టిన తేదీ, తక్కువ హాల్‌ టిక్కెట్‌ నెంబర్‌లను పరిగణిస్తారు. ట్రిపుల్‌ఐటీల్లోని 85% సీట్లకు ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులను, 15శాతం సీట్లకు ప్రతిభ ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులను(నాన్‌ లోకల్‌) ఓపెన్‌ కేటగిరీలో ఎంపిక చేస్తారు.

రిజర్వేషన్‌
ట్రిపుల్‌ఐటీలోని సీట్ల భర్తీ విషయంలో రిజర్వేçషన్ల ప్రకారం-విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఎస్సీ-15 శాతం, ఎస్టీ-6 శాతం, బీసీ ఏ-7 శాతం, బీసీ బీ-10 శాతం, బీసీ సీ-1 శాతం, బీసీ డీ-7 శాతం, బీసీ ఈ-4 శాతం, దివ్యాంగులకు 5 శాతం, సైనికుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీకి -1 శాతం, క్రీడా కోటా కింద 0.5 శాతం సీట్లు కేటాయిస్తారు. టిపుల్‌ ఐటీలోని మొత్తం సీట్లలో అన్ని కేటగిరీలలో అమ్మాయిలకు 33 1/3 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది.

 ఫీజు
ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ల్లో ప్రవేశం పొందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు మొదటి రెండేళ్ల పీయూసీలో ఏడాదికి రూ.45,000; ఆ తర్వాత నాలుగేళ్ల బీటెక్‌ కోర్సులో ఏడాదికి రూ.50,000 ఫీజు చెల్లించాలి.విద్యార్థుల కుటుంబీకుల వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌(విద్యా దీవెన)కు అర్హులైన విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు మినహాయింపు ఉంటుంది.

చ‌ద‌వండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

కోర్సులు
ఆరేళ్ల ఇంటెగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ను రెండు దశలుగా విభజించారు. మొదటి దశలో రెండేళ్ల ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) ఉంటుంది. అందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, తెలుగు/సంస్కృతం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయాలజీ సబ్జెక్టులను బోధిస్తారు. తర్వాత దశలో నాలుగేళ్ల బీటెక్‌ కోర్సులో పీయూసీలో విద్యార్థి ప్రతిభ ఆధారంగా ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లకు ఎంపిక చేస్తారు. అందుబాటులోని బ్రాంచ్‌లు.. కెమికల్‌ ఇంజనీరింగ్‌(నూజివీడు, ఆర్‌కేవ్యాలీలో మాత్రమే), సివిల్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఎలక్టాన్రిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌(నూజివీడు, ఆర్‌కేవ్యాలీలో మాత్రమే)

దరఖాస్తు విధానం
ఆర్‌జీయూకేటీ వెబ్‌సైట్‌ లేదా ఏపీ ఆన్‌లైన్‌ సెంటర్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీలకు రూ.200.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2023
  • ప్రొవిషనల్‌ ఎంపిక జాబితా వెల్లడి:13.07.2023
  • పూర్తివివరాలకు https://www.rgukt.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

చ‌ద‌వండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!

Published date : 08 Jan 2024 04:34PM

Photo Stories