Skip to main content

Union Budget: సాయంత్రం 5 తర్వాతే బడ్జెట్‌ ప్రవేశపెట్టేవారు.. ఎందుకో తెలుసా...కేవలం 800 పదాలతో బడ్జెట్‌ను ముగించిన మంత్రి ఎవరంటే...

బడ్జెట్‌ సమయం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆర్థిక పద్దుపై దేశ ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ పాలనపగ్గాలు చేపట్టిన తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్డెట్‌ను పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు అలాగే.. 2024లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. బీజేపీకి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ కానుంది. ఈ క్రమంలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సమయంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటో తెలుసుకుందాం.

1977లో అప్పటి ఆర్థికమంత్రి హీరాభాయ్‌ ములిజిభాయ్‌ పటేల్‌ కేవలం 800 పదాలతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్లో వినియోగించే పదాలను ప్రామాణికంగా తీసుకుంటే.. సుదీర్ఘమైన పద్దును మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రసంగించారు. పీవీ నరసింహా రావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన.. 18,650 పదాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

చ‌దవండి: షార్ట్‌కట్స్‌ వద్దు... చీటింగ్‌ చేసేందుకు తెలివితేటల్ని వినియోగించకండి
అత్యధిక బడ్జెట్‌ ప్రసంగాలు చేసిన వారిలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ మొదటి స్థానంలో ఉన్నారు. 1962–69లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం 10సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటికీ ఈ రికార్డ్‌ చెక్క చెదరకుండా అలానే ఉంది.

Budget


బ్రిటీష్‌ కాలం నుంచి ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయతీ. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫిబ్రవరి 1కి మారింది. కొత్త తేదీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థికమంత్రిగా అరుణ్‌ జైట్లీ నిలిచారు.
జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ మాత్రమే బడ్జెట్‌ను సమర్పించిన ప్రధానులు.
1999 వరకు కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా ఆ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు.

చ‌దవండి: 2024లో రోదసిలోకి మానవుడు.... చరిత్ర సృష్టించనున్న ఇస్రో
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సుదీర్ఘమైన బడ్జెట్‌ ప్రసంగాన్ని చేశారు. 2020 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆమె 2.42 గంటలపాటు ప్రసంగించారు. ఇదే ఇంతవరకు ఎక్కువ సమయం ప్రసంగించిన బడ్జెట్‌గా రికార్డ్‌ నమోదు చేసింది.
కేంద్ర బడ్జెట్‌ 1950లో లీక్‌ అయింది. అప్పటి వరకు రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్‌ ముద్రణ జరుగుతుండగా ఈ లీక్‌ తర్వాత దానిని న్యూఢిల్లీలోని మింటో రోడ్‌లోని ప్రెస్‌కి మార్చారు. 
ఫిబ్రవరి 1, 2021న, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మొదటి పేపర్‌లెస్‌ బడ్జెట్‌ను సమర్పించారు.

Published date : 27 Jan 2023 04:00PM

Photo Stories