Skip to main content

Interim Budget 2024: 2024 బడ్జెట్ పూర్తి వివ‌రాలు.. తెలుగు రాష్ట్రాల‌కి ఇచ్చిన రైల్వే బడ్జెట్ ఎంతంటే..?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీ మధ్యంతర బడ్జెట్ 2024 ప్రవేశపెట్టారు.
Budget Highlights   Budget 2024 Highlights And Announcements   Finance Minister Nirmala Sitharaman presenting Interim Budget 2024

ఈ బడ్జెట్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..

రైల్వే కారిడార్లకు గ్రీన్‌ లైట్‌..
సరుకు రవాణాను సులభతరం చేస్తూ బడ్జెట్‌లో ప్రకటించిన మూడు మల్టీ మోడల్‌ ఆర్థిక కారిడార్ల నిర్మాణంతో రైలు ప్రయాణికుల టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌ కష్టాలు తీరనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. రైల్వేల సరుకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచి జీడీపీ వృద్ధి రేటును పరుగులు తీయించేందుకు ప్రత్యేకంగా మూడు ఆర్థిక కారిడార్లను నెలకొల్పనున్నట్లు బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇంధనం, ఖనిజాలు, సిమెంట్‌ కారిడార్లు, పోర్టు కనెక్టివిటీ కారిడార్లు, అధిక రద్దీ సాంద్రత కారిడార్లు ఇందులో ఉంటాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2.52 లక్షల కోట్లు కేటాయించారు.

బడ్జెట్‌ కేటాయింపులపై రైల్వే మంత్రి అశ్వని కుమార్‌ ఫిబ్రవరి 1వ తేదీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక కారిడార్లలో భాగంగా కొత్తగా 40,000 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇది నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు 2030–31 నాటికి ప్రయాణికులకు టికెట్‌ వెయిటింగ్‌ ఇబ్బందులను తొలగిస్తుందన్నారు. మూడు కారిడార్లపై బడ్జెట్‌లో ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఇవి కేవలం సరుకు రవాణా కోసం మాత్రమే కాకుండా మల్టీ మోడల్‌ కారిడార్ల మాదిరిగా పని చేస్తాయన్నారు. ప్రత్యేక కారిడార్లలో భాగంగా 434 ప్రాజెక్టులను సుమారు రూ.11 లక్షల కోట్ల వ్యయంతో చేపడుతున్నట్లు తెలిపారు.  

40 వేల బోగీలు ఇక ‘వందే భారత్‌’..  
దేశంలో 40,000 సాధారణ రైలు బోగీలను వందే భారత్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించనున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికుల భద్రత, సదుపాయాలు, సౌకర్యాలను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వందే భారత్, అమృత్‌ భారత్‌ రైళ్లు విజయవంతం కావడం ఇతర బోగీలను సైతం ఆధునీకరించాల్సిన అవసరాన్ని వెల్లడించిందని రైల్వే మంత్రి అశ్వనీ కుమార్‌ పేర్కొన్నారు. ‘మన వద్ద దాదాపు 40,000 సంప్రదాయ బోగీలున్నాయి. వీటిని ఆధునీకరించవచ్చు.

రైల్వేల సామర్థ్యాన్ని పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతేడాది రైల్వేలు 5,200 కి.మీ. మేర నూతన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇది మొత్తం స్విట్జర్లాండ్‌ నెట్‌వర్క్‌ పరిమాణంతో సమానం. ఈ ఏడాది మరో 5,500 కి.మీ. నిర్మాణం జరుగుతుంది. 2014లో రోజుకు కేవలం నాలుగు కి.మీ. నుంచి ఇప్పుడు 15 కి.మీ. మేర కొత్త ట్రాక్‌లను నిర్మిస్తున్నాం. నెట్‌వర్క్‌ ఏర్పాటులో ఇది గణనీయమైన పురోభివృద్ధి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి మూలధన వ్యయంలో రైల్వేలు 82 శాతం ఆర్జించాయి’ అని అశ్వనీ కుమార్‌ తెలిపారు. 

Union Budget 2024-25 Allocations: రూ.47.65 లక్షల కోట్ల‌ బడ్జెట్‌.. శాఖల వారీగా కేటాయింపులు ఇలా..!

అమృత చతుర్భుజం.. 
‘ప్రధానంగా ఇంధనం, లోహాలు, సిమెంట్‌ కారిడార్లు రహదారులపై కాలుష్యాన్ని తగ్గిస్తాయి. సరుకు రవాణా చౌకగా జరుగుతుంది. ఓడ రేవులతో రైలు మార్గం అనుసంధానం కూడా అవుతుంది’ అని రైల్వే మంత్రి చెప్పారు. మూడో కారిడార్‌ను అమృత చతుర్భుజంగా అభివర్ణించారు. ‘రైల్వే ట్రాఫిక్‌ సాంద్రత అధికంగా ఉండే రూట్లలో అమృత చతుర్భుజం ఏర్పాటవుతుంది.

రానున్న 6 నుంచి 8 సంవత్సరాలలో మూడు కారిడార్ల ద్వారా మొత్తంగా దాదాపు 40 వేల కి.మీ. మేర కొత్తగా రైల్వే ట్రాక్‌లను నిర్మిస్తాం. దీనిద్వారా రైల్వేల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. మన ఆర్థిక వ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పు తెస్తుంది. అంతేకాకుండా ఇది 90 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. రైల్వేలు అత్యంత కాలుష్య రహిత రవాణా మార్గాలు. ఇతర మార్గాలతో పోలిస్తే రైలు రవాణా 40 – 50 శాతం చౌక’ అని అశ్వనీ కుమార్‌ తెలిపారు. 

విదేశాంగ శాఖకు రూ.22,154 కోట్లు..
కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో విదేశాంగ శాఖకు రూ.22,154 కోట్లు కేటాయించారు. గతేడాది రూ.18,050 కోట్లు ఇవ్వగా.. 2024–25 బడ్జెట్‌లో రూ.4,104 కోట్లు పెంచి ఇచ్చారు. ఇక పొరుగుకు మొదట (నైబర్‌హుడ్‌ ఫస్ట్‌) పాలసీకింద ఎక్కువ సాయాన్ని భూటాన్‌ అందుకోనుంది. ఈ దేశానికి ఈ బడ్జెట్‌లో రూ.2,068 కోట్లు సాయాన్ని ప్రతిపాదించారు. గతేడాది బడ్జెట్‌లో ఈ హిమాలయ దేశానికి రూ.2,400 కోట్లు ఇచ్చారు.

ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించడానికి గాను ఆ దేశంలోని చబహర్‌ పోర్టుకు రూ.100 కోట్లు కేటాయించారు. ఇక మాల్దీవులకు అభివృద్ధి సాయంలో గతేడాది కంటే రూ.170 కోట్లు తగ్గించి ఈ బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించారు. అఫ్గానిస్తాన్‌కు రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు, నేపాల్‌కు రూ.700 కోట్లు, శ్రీలంకకు రూ.75 కోట్లు, మారిషస్‌కు రూ.370 కోట్లు, మయన్మార్‌కు రూ. 250 కోట్లు అభివృద్ధి సాయం ప్రతిపాదించారు. ఆఫ్రికా దేశాల కోసం ప్రత్యేకంగా రూ.200 కోట్లు ప్రకటించారు. లాటిన్‌ అమెరికా, యురేసియా ప్రాంతాల్లోని దేశాలకు అభివృద్ధి సాయంగా రూ. 4,883 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. 

ఐఎంఈసీ ఓ గేమ్‌ చేంజర్‌..
వ్యూహాత్మంగా, ఆర్థిక పరంగా భారత్‌ ఇతర దేశాలకు ఇండియా మిడిల్‌ ఈస్ట్‌ యూరోప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (ఐఎంఈసీ) ఓ గేమ్‌ చేంజర్‌ అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ప్రపంచ వాణిజ్యానికి ఈ కారిడార్‌ వందల ఏళ్ల పాటు ఆధారభూతంగా ఉంటుందని అన్నారు. భారత నేలపై నుంచి ఈ కారిడార్‌ ప్రారంభమైందనే విషయం చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. 

జనగణన, ఎన్‌పీఆర్‌కు రూ.1,277 కోట్లు..
2024–25 మధ్యంతర బడ్జెట్‌లో జనాభా గణన, ఎన్‌పీఆర్‌ కోసం రూ.1,277.80 కోట్లు కేటాయించారు. దీంతో ఈ ఏడాది కూడా జనాభా లెక్కించే అవకాశం లేదని సంకేతాన్నిచ్చినట్లైంది. జనాభా లెక్కలు, ఎన్‌పీఆర్‌ల కోసం ప్రభుత్వానికి రూ.12,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 24, 2019న జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం రూ.8,754.23 కోట్ల వ్యయంతో జనాభా గణన–2021, రూ.3,941.35 కోట్ల వ్యయంతో జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌) ప్రతిపాదనను ఆమోదించింది. 2020, ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30, 2020 వరకు దేశవ్యాప్తంగా జనాభా గణన, ఎన్‌పీఆర్‌ను అప్‌డేట్‌ చేయడానికి సంబంధించిన హౌస్‌ లిస్టింగ్‌ దశ షెడ్యూల్‌ చేసింది.

అయితే కోవిడ్‌–19 వ్యాప్తి కారణంగా దీన్ని వాయిదా వేశారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల జరిగే నేపథ్యంలో 2024లో జనాభా గణన చేపట్టే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఎన్యుమరేటర్ల ద్వారా కాకుండా సొంతంగా జనాభా గణన ఫారమ్‌ను పూరించే హక్కును వినియోగించుకోవాలనుకునే పౌరులకు ఎన్‌పీఆర్‌ను తప్పనిసరి చేశారు. ఇందుకు సెన్సస్‌ అథారిటీ స్వీయ గణన పోర్టల్‌ను రూపొందించగా.. అది ఇంకా ప్రారంభం కాలేదు. స్వీయ–గణన సమయంలో, ఆధార్‌ లేదా మొబైల్‌ నంబర్‌ తప్పనిసరిగా సేకరిస్తారు.  

Union Budget Highlights 2024-24 : కేంద్ర ఆర్థికమంత్రులుగా ఉండి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టని వారు వీరే.. కార‌ణం తెలిస్తే.. మీరే..

ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,138 కోట్లు.. తెలంగాణకు రూ.5,071 కోట్లు..
రైల్వేల అభివృద్ధి నిమిత్తం తాజా బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,071 కోట్లు కేటాయిచినట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ అన్నారు. 2009–14 కాలంతో పోలిస్తే 2023–24 నాటికి పదేళ్లలో కేటాయింపులు పది రెట్లు పెరిగాయన్నారు. రాష్ట్రంలో రైల్వేల్లో పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగినట్లు చెప్పారు.. ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,138 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 2009–14 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ.889 కోట్లు కేటాయించినట్లు వివరించారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేసిన కేంద్రమంత్రి.. పనులు సాగుతున్నాయన్నారు.

ఫిబ్రవరి 1వ తేదీ పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024–25 మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత రైల్‌ భవన్‌లో అశ్విని వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడారు. నూతన ట్రాక్‌ నిర్మాణం 2009–14 మధ్య సగటున ఏడాదికి 17 కి.మీ. మేర జరిగితే, 2014–24 మధ్య 69 కి.మీ. మేర జరిగిందన్నారు. 2024–25లో 142 కి.మీ. ట్రాక్‌ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 2009–14 కాలంలో సగటున ఏడాదికి 41 కి.మీ. మేర విద్యుదీకరణ జరిగితే 2014–24 మధ్య 116 కి.మీ. చేసినట్లు తెలిపారు.

2023–24లో 100% విద్యుదీకరణ పూర్తయిందని అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. రూ.31,221 కోట్ల విలువతో 2,338 కి.మీ. మేర 14 ప్రాజెక్టుల (నూతన ట్రాక్‌)కు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్ధం 40 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, 53 లిఫ్టులు, 27 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 40 స్టేషన్లను అమృత్‌ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్‌ వివరించారు. 

రక్షణకు రూ.6.21 లక్షల కోట్లు.. 

Budget


కేంద్ర ప్రభుత్వం 2024–25 బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయింపులను గత ఏడాది కంటే స్వల్పంగా పెంచింది. 2023–24 బడ్జెట్‌లో రూ.5.94 లక్షల కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ.6.21 లక్షల కోట్లు కేటాయించారు. మిలిటరీ కేపిటల్‌ వ్యయం కింద పెద్ద ఎత్తున కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధ ఓడల కొనుగోలు కోసం రక్షణ శాఖకు రూ.1.72 లక్షల కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపు గత ఏడాది 1.62 లక్షల కోట్లుగా ఉంది. 

మిలిటరీ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికను సమకూర్చుకునేందుకు ‘ఆత్మ నిర్భరత’ను వేగవంతం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. మొత్తం రెవెన్యూ వ్యయం రూ.4,39,300 కోట్లు కాగా, ఇందులో రక్షణ శాఖ పింఛన్లకు 1,41,205 కోట్లు, రక్షణ సర్విసులకు 2,82,772 కోట్లు, రక్షణ మంత్రిత్వ శాఖ (సివిల్‌)కు రూ.15,322 కోట్లు కేటాయించారు.

విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం రూ. 40,777 కోట్లు, ఇతర పరికరాల కోసం 62,343 కోట్లను కేటాయించారు. నేవీ వాహనాల కోసం రూ.23,800 కోట్లు, డాక్‌యార్డ్‌ ప్రాజెక్టుల కోసం రూ.6,830 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం కోసం ఆర్మికి రూ.1,92,680 కోట్లు, నేవీకి రూ.32,778 కోట్లు, భారత వాయుసేనకు రూ.46,223 కోట్లు కేటాయించారు.

మొత్తమ్మీద రక్షణ శాఖకు ఈసారి కేటాయింపులు స్వల్పంగానే పెరిగాయని, ఇది మిలిటరీపై ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తుందని జాతీయ భద్రత అధ్యయన కేంద్రంలోని అసోసియేట్‌ ప్రొఫెసర్‌డాక్టర్‌ లక్ష్మణ్‌ కుమార్‌ బెహెరా చెప్పారు.కేపిటల్‌ వ్యయం కోసం రూ.10 వేల కోట్లను పెంచడాన్ని ఆరోగ్యకరసంకేతంగానే భావించాలన్నారు. 

కేంద్ర హోంశాఖకు రూ.2 లక్షల కోట్లు.. 
కేంద్ర హోంశాఖకు 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో అంతర్గత, సరిహద్దు భద్రతకు ప్రాధాన్యమిస్తూ రూ.2,02,868.70 కోట్లు కేటాయించారు. అమిత్‌షా నేతృత్వంలోని ఈ శాఖకు 2023–24లో రూ.1,96,034.91 కోట్లను కేటాయించారు. ఈసారి బడ్జెట్‌లో అత్యధిక నిధులను కేంద్ర బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌కు ఇచ్చారు. పారామిలిటరీ బలగాల కిందకు వచ్చే పోలీసులకు రూ. 1,32,345.47 కోట్లను, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు 37,277.74 కోట్లను కేటాయించారు.

లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు, అండమాన్‌ నికోబార్‌ దీవులకు రూ. 5,866.37 కోట్లు, చండీగఢ్‌కు రూ. 5,862.62 కోట్లు, పుదుచ్చేరికి 3269 కోట్లు, దాద్రా నగర్‌ హవేలి–డామన్‌ డయ్యూకు 2,648.97 కోట్లు, లక్షదీ్వప్‌కు 1,490.10 కోట్లు, ఢిల్లీకి 1,168.01 కోట్లు కేటాయించారు. మంత్రిమండలి, కేబినెట్‌ సెక్రటేరియట్, పీఎంఓ ఖర్చుల కోసం 1,248.91 కోట్లు ఇచ్చారు.

2023–24 బడ్జెట్‌లో పారామిలిటరీ బలగాలైన సీఆర్‌పీఎఫ్‌కు 32,809.65 కోట్లు కేటాయించగా, సవరించిన అంచనాల మేరకు 31,389.04 కోట్లు ఇచ్చారు.ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు రూ.3,195.09 కోట్లు (2023–24లో 3,268.94 కోట్లు), వామపక్ష ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం కింద 3,199.62 కోట్లు, సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమాల కోసం 335 కోట్లు, సేఫ్‌ సిటీ ప్రాజెక్టుల కోసం 214.44 కోట్లు, ల్యాండ్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు రూ.330 కోట్లు కేటాయించారు.  

సీబీఐకి రూ.928.46 కోట్లు..
2024–25 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి రూ.928.46 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇది గతేడాది కంటే రూ.40.4 కోట్లు తక్కువ. సీబీఐ శిక్షణా కేంద్రాల ఆధునీకరణ, టెక్నికల్, ఫోరెన్సిక్‌ సపోర్ట్‌ యూనిట్ల ఏర్పాటు, సమగ్ర ఆధునీకరణ, భూమి కొనుగోలు, ఏజెన్సీకి కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణం వంటి పలు ప్రాజెక్టులకు కేటాయింపులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ.. బ్యాంకురుణ మోసాలు, విదేశాల్లోని కోర్టులలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి కేసులతో పాటు కృత్రిమ మేధస్సు, క్రిప్టోకరెన్సీ, డార్క్‌నెట్‌ల ఆధిపత్యంతో అభివృద్ధిచెందుతున్న నేరాలను పరిష్కరిస్తుంది.ఇది పలు రాష్ట్రాలు, హైకోర్టులు,సుప్రీంకోర్టు అప్పగించిన క్రిమినల్‌ కేసులను కూడా డీల్‌ చేస్తుంది. 

‘ఈ–కోర్టు’కు 825 కోట్లు.. 
దిగువ న్యాయవ్యవస్థలోమౌలిక సదుపాయాలను ఆధునీకరించేందుకు, కేసుల వివరాలను కంప్యూటర్‌లో డిజిటల్‌ రూపంలో పొందుపరిచేందుకు రూపొందిస్తోన్న ప్రతిష్టాత్మక ఈ–కోర్ట్‌ ప్రాజెక్ట్‌ 3వ దశకోసం బడ్జెట్‌లో ఈ ఆర్థిక సంవత్సరం రూ. 825 కోట్లు కేటాయించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1,500 కోట్లు పెంచాలని ప్రతిపాదించారు. గత ఏడాది సెపె్టంబర్‌లో ఈ ప్రాజెక్టు రూ.7,210 కోట్ల ఆర్థిక వ్యయంతో కేబినెట్‌ ఆమోదం పొందిన విషయంతెలిసిందే. 2024–25 బడ్జెట్‌లో ఈప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు కేటాయించాలని కూడా తాజా అంచనాలురూపొందించారు.

4 సంవత్సరాలలోపూర్తవుతుందని భావిస్తున్న ఈ ప్రాజెక్టులో కోర్టు రికార్డులు, వారసత్వ కేసులు,పెండింగ్‌ కేసులు అన్నింటినీ డిజిటల్‌ రూపంలో చేస్తారు. 3,108 కోట్లపత్రాలను డిజిటలైజ్‌ చేసేందుకు రూ. 2,038.40 కోట్లు అవుతుందని అంచనా. 25 పెటా బైట్ల స్టోరేజీతో క్లౌడ్‌ టెక్నాలజీ సాంకేతికతను ఈ వ్యవస్థకోసం ఉపయోగించడం గొప్ప అడుగుగా ప్రభుత్వం అభివర్ణించింది. దీనికి సంబంధించిన హార్డ్‌ వేర్‌ను రాష్ట్రాలకు కేంద్రమే అందిస్తుంది. కేంద్రం, రాష్ట్రాలు, 25 రాష్ట్రాల హైకోర్టులతో ఒక త్రైపాక్షిక ఒప్పందంజరుగుతుంది.

Union Budget 2024 Highlights: 2024 బడ్జెట్‌లో కీలకమైన అంశాలు ఇవే..!

సాగుకు రూ.1.27లక్షల కోట్లు..

Farmar


వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25)గాను  వ్యవసాయ మంత్రిత్వ శాఖకు  కేంద్రం రూ.1.27 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–2024)తో పోల్చుకుంటే కేటాయింపులు స్వల్పంగా  పెంచింది. రూ.1,27,469.88 కోట్లలో వ్యవసాయ విభాగానికి రూ.1,17,528 కోట్లు కేటాయించగా, వ్యవసాయ పరిశోధన, విద్య (డేర్‌) విభాగానికి రూ.9,941 కోట్లు కేటాయించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరించిన అంచనాల ప్రకారం.. వ్యవసాయ విభాగానికి రూ.1,16,788.96 కోట్లు, డేర్‌కు రూ.9,876.60 కోట్లు కేటాయించారు. పీఎం కిసాన్‌ పథకానికివ్యవసాయ విభాగం పరిధిలోని ప్రతిష్టాత్మక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.60 వేల కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా రూ.60 వేల కోట్లే కేటాయించారు. ఈ పథకం కింద కేంద్రం రైతులకు మూడు వాయిదాలుగా సంవత్సరానికి రూ.6 వేలు చొప్పున అందజేస్తోంది.  

ప్రజా పంపిణీకి రూ.8 వేల కోట్ల తగ్గింపు.. 
వినియోగదారుల వ్యవహారాలు,ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే కేటాయింపులు తగ్గాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఈ శాఖకు రూ.2.13 లక్షల కోట్ల పైచిలుకు కేటాయించారు. ఇందులో వినియోగదారుల వ్యవహారా లకు 302.62 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీని బడ్జెట్‌ రూ.309.26 కోట్లు కావడం గమనార్హం.

ఇక ఆహార, ప్రజా పంపిణీ విభాగానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,21,924.64 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది కొంత కోత విధించి రూ.2,13,019 కోట్ల బడ్జెట్‌ మాత్రమే కేంద్రం కేటాయించింది. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్‌ షాపుల ద్వారా 80 కోట్లకు పైగా ప్రజలకు ఈ విభాగం ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తోంది.  

రసాయనాలు ఎరువుల శాఖకు రూ.1.68 లక్షల కోట్లు.. 
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రసాయనాలు, ఎరువుల శాఖకు రూ.1.68 లక్షల కోట్లు కేటాయించారు. ఎరువుల విభాగానికి కేటాయింపులు రూ.1,88,947.29 కోట్ల నుంచి రూ.1,64,150.81 కోట్లకు తగ్గించారు. ఇక రసాయనాలు, పెట్రో రసాయనాల విభాగానికి కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.572.63 కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాదికి కేవలం రూ.139.05 కోట్లు మాత్రమే కేటాయించారు.

అయితే ఫార్మాస్యూటికల్స్‌ విభాగానికి మాత్రం కేటాయింపులు పెరగడం గమనార్హం. దీనికి కేటాయింపులు రూ.2,697.95 కోట్ల నుంచి రూ.4,089.95 కోట్లకు పెరిగాయి. అలాగే హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలోని సహకార శాఖకు కూడా రూ.747.84 కోట్ల నుంచి రూ.1,183.39 కోట్లకు కేటాయింపులు పెరిగాయి. ఇక మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖకు రూ.7,105.74 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు. 

నీళ్లకు నిధులు పెరిగాయ్‌..
కేంద్ర ప్రభుత్వం 2024 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో కేంద్ర జలశక్తి శాఖకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. గతేడాది జలశక్తి శాఖకు మొత్తంగా కేటాయించిన నిధుల కంటే దాదాపు రూ. 2 వేల కోట్ల మేర కేటాయింపులను పెంచింది. గతేడాది జలశక్తి శాఖకు రూ. 96,549 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఆ కేటాయింపులను రూ. 98,418 కోట్లకు పెంచింది. ముఖ్యంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద నిధుల మొత్తాన్ని రూ. 8,781 కోట్ల నుంచి రూ. 11,391 కోట్లకు పెంచింది.

దీనికిందే ఉన్న సమగ్ర సాగునీటి సత్వర ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) పథకానికి గతేడాదికి సమానంగా రూ. 2,500 కోట్లు కేటాయించింది. ఏఐబీపీ పథకంలో తెలంగాణ, ఏపీకి సంబంధించి వివిధ ప్రాజెక్టులకు ఈ నిధులు కేటాయించే అవకా శం ఉంది.

దీంతోపాటే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ సమయంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరగా పీఎంకేఎస్‌వై పథకం కింద ప్రాజె క్టుకు ఆర్థిక సాయం అందిస్తా మని హామీ ఇచ్చారు. ఈ నిధు ల్లోనే ఆ మొత్తాలను కేటాయించాల్సి ఉంటుంది. ఇక ఆయకట్టు అభివృధ్ధి పథకం (కాడా) కింద రూ. 1,400 కోట్లు కేటాయించగా దీని కింద సైతం తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులున్నాయి.

నదుల అనుసంధానానికి పెరిగిన కేటాయింపులు..
నదుల అనుసంధాన కార్యక్రమానికి కేంద్రం నిధులు పెంచింది. గతేడాది కేవలం రూ.1,500 కోట్లు కేటాయించిన మోదీ ప్రభుత్వం.. ఈ ఏడాది దాన్ని రూ.4 వేల కోట్లకు పెంచింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కెన్‌–బెత్వా నదుల అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే మొదలవ్వడం, నాలుగు రోజుల కిందటే మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ మధ్య పర్బతి–కాలిసింద్‌–చంబల్‌ నదులను తూర్పు రాజస్తాన్‌ కాలువతో కలిపే అనుసంధాన ప్రక్రియపై ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో కేటాయింపులు పెంచినట్లు తెలుస్తోంది.

అయితే గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియపై ఎలాంటి ముందడుగు ఉంటుందన్నది తేలాల్సి ఉంది. గతేడాది తుంగభద్ర జలాలపై ఆధారపడి కర్ణాటక చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర సాయం కింద రూ. 5,300 కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించగా ఈ ఏడాది దాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులు ముఖ్యంగా ఏపీలోని పోలవరం ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు అంశాల ప్రస్తావన లేదు. 

‘లఖ్‌పతి దీదీ’ కిందకు 3 కోట్ల మంది మహిళలు..
న్యూఢిల్లీ: స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం తీసుకుని పొదుపు బాటలో పయనిస్తూ తమ దక్షతతో వ్యాపారం చేస్తూ లఖ్‌పతి దీదీ (లక్షాధి కారి)లుగా అవతరిస్తున్న మహిళల సంఖ్యను మరింత పెంచడంపై దృష్టిపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ విషయాన్ని తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. ‘83 లక్షల స్వయం సహాయక బృందాలు(ఎస్‌హెచ్‌జీ)ల్లో దాదాపు తొమ్మిది కోట్ల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వేల కోట్ల రుణాలు తీసుకుంటూ స్వయం ఉపాధి సాధిస్తూ, చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నారు.

కష్టించి వ్యాపారాన్ని నిలబెట్టుకుని తమ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలుస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది మహిళలు ఏటా కనీసం రూ.1 లక్ష ఆర్జిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా ఇలా పొదుపు సంఘాల మహిళలు దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తూ సాధికారత, స్వావలంభన సాధిస్తూ అందరికీ స్ఫూర్తిప్రదాతలయ్యారు. ఇలాంటి లక్షాధికారి(లఖ్‌పతి దీదీ)ల సంఖ్యను రెండు నుంచి మూడు కోట్లకు పెంచడమే మా ప్రభుత్వ లక్ష్యం’ అని నిర్మల లోక్‌సభలో వ్యాఖ్యానించారు. 

ఆశ, అంగన్‌వాడీలకు ‘ఆయుష్మాన్‌ భారత్‌’..
ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు హెల్త్‌కేర్‌ కవరేజీని కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించారు. వారిని ఆయుష్మాన్‌ భారత్‌ బీమా పథకం పరిధిలోకి తీసుకువస్తు న్నట్లు 2024–25 బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ ప్రకటించారు. సక్షం అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0 కింద అంగన్‌వాడీ కేంద్రాలను ఉన్నతీకరించడం ద్వారా న్యూట్రిషన్‌ డెలివరీ వేగవంతం అవుతుందని చెప్పారు. ఇప్పుడున్న ఆస్పత్రుల మౌలిక వసతు లను వినియోగించుకుని మరిన్ని మెడికల్‌ కాలేజీలు ఏర్పా టు చేయాలనే ప్రణాళికలో ప్రభుత్వం ఉందని తెలిపారు. దీనిని పరిశీలించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామ న్నారు.

ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) కేటాయింపులను రూ. 6,800 కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు పెంచినట్లు నిర్మల చెప్పారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ నియంత్రణ కోసం 9 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న బాలికలకు వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహిస్తామన్నా రు. సమగ్ర ఆచరణ కోసం వివిధ మాతా శిశు హెల్త్‌కేర్‌ స్కీంలను ఒకే గొడుగు కిందకు తెస్తామన్నారు. మిషన్‌ ఇంద్రధనుష్‌ మరింత సమర్థంగా అమలు చేయడంలో భాగంగా కొత్తగా రూపొందించిన యు–విన్‌ పోర్టల్‌ను దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నామని తెలిపారు.  

ఆదాయ పన్ను శ్లాబ్‌లు యథాతథం..
మధ్యతరగతి, వేతనజీవుల ఆశలపై ఆర్థిక మంత్రి నీళ్లు కుమ్మరించారు. ఎన్నికల వేళ ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ కావడంతో కాసింత ఉపశమన మాటలు వస్తాయనుకున్న వారికి గతంలో చేసిన గొప్పలను ఏకరువు పెట్టి సరిపెట్టారు. మధ్యంతర బడ్జెట్‌ కావడంతో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదన్నారు.

వ్యక్తిగత ఆదాయ పన్నుల శ్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవన్నారు. గత పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రత్యక్ష పన్ను ల వసూళ్లూ 3 రెట్లకుపైగా పెరగ్గా పన్ను రిట ర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 2.4 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. 2013– 14 ఆర్థిక సంవత్సరానికి దేశంలో పన్ను చెల్లించాల్సినవసరం లేని ఆదాయ పరిమితి రూ.2.2 లక్షలు ఉంటే ఇప్పుడు 7 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు ఒక్క రూపాయి పన్ను చెల్లించా ల్సిన పని లేదన్నారు.

కొత్త పన్నుల విధానం ఎన్నుకున్న వారికే ఇది వర్తింపు..
7 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదన్న ఆర్థిక మంత్రి మాటలపై మధ్యతరగతి ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇది కేవలం కొత్త పన్నుల విధానం ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని, పాత పన్ను ల విధానంలో ఉన్న వారికి ఈ రిబేటు పరిమితి రూ.5 లక్షలే ఉందన్న విషయాన్ని వారు గుర్తుచేశారు. నాలుగేళ్ల కిందట కొత్త పన్నుల విధానం తీసుకొచ్చారు. పాత విధానంతో పోలి స్తే తక్కువ పన్ను రేట్లతో అన్ని వయసుల వారికి ఒకే విధమైన శ్లాబ్‌ రేట్ల ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ఎంచుకుంటే సెక్షన్‌ 80సీ, గృహ రుణాలు, స్టాండర్డ్‌ డిడక్షన్, ఆరోగ్య బీమా వంటి పలు సెక్షన్ల కింద లభించే ప్రయోజనాలను పొందడానికి వీలుండదు. మొత్తం ఆదాయం మీద పన్ను చెల్లించా ల్సి వస్తుంది.

కొత్త పన్నుల విధానంలో 7 లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించన వరం లేకుండా సెక్షన్‌ 87ఏ కింద రిబేటు ప్రకటించింది. దీనికింద రూ.25,000 ప్రయో జనం లభిస్తుంది. అదే పాత పన్నుల విధానం ఎంచుకుంటే సెక్షణ్‌ 87ఏ రిబేటు పరిమితిని రూ.5 లక్షల ఆదాయం వరకు పరిమితం చేశారు. పాత పన్నుల విధానం ఎంచుకున్న వారికి కేవలం రూ.12,500 మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. పాత విధానం నుంచి కొత్త విధానంలోకి మార్చాలన్న ఉద్దే శ్యంతో నిర్మాల ఈ నిర్ణయం తీసుకున్నారు.

రిటైల్‌ వ్యాపారుల ఊహాజనిత ఆదాయం పరిమి తిని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు, వృత్తినిపుణుల ఊహాజనిత ఆదాయ పరిమితిని రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో పన్ను రిట ర్నులు సులభంగా దాఖలు చేసే విధంగా పలు చర్యలు తీసుకున్నామని, దీంతో 2013– 14లో 93 రోజులుగా ఉన్న రిఫండు సమయాన్ని ఇప్పుడు పదిరోజులకు తగ్గించినట్లుగా తెలిపారు. 

గ్రామీణాభివృద్ధికి.. రూ.1.77 లక్షల కోట్లు..
2024–25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.1.77 లక్షల కోట్లు ప్రకటించారు. గతేడాది రూ.1.57 లక్షల కోట్ల కంటే 12 శాతం ఎక్కువగా కేటాయించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86,000 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్‌లో చేసిన రూ.60,000 కోట్ల కంటే ఇది 43 శాతం ఎక్కువ. వచ్చే ఐదేళ్లలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన– గ్రామీణ్‌ పథకానికి రూ.54,500 కోట్లు కేటాయించారు.

‘లఖ్‌ పతి దీదీ’ల లక్ష్యాన్ని రెండు కోట్ల నుంచి 3 కోట్లకు పెంచినట్లు సీతారామన్‌ ప్రకటించారు. జాతీయ జీవనోపాధి మిషన్‌–అజీవికకు రూ.15,047 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.14,129.17 కోట్ల కంటే ఇదిదాదాపు 6% ఎక్కువ. కాగా, ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజనకు కేటాయింపులు తగ్గాయి. ఈ బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు కేటాయించారు.  

పర్యావరణ శాఖకు.. రూ.3,265 కోట్లు..
కేంద్ర ప్రభుత్వం 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో పర్యావ రణ శాఖకు రూ.3,265 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఈ మొత్తం రూ.3,231 కోట్లు ఉండగా, ఈ సారి కొద్దిగా పెరి గింది. అలాగే కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర జూ అథారిటీ, జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ,ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ సంస్థలకు గతేడాది బడ్జెట్‌లో 158.60 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.192 కోట్లు కేటాయించారు.

కాగా, స్వయంప్రతిపత్తి సంస్థలైన జీబీ పంత్‌ హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎన్వి రాన్‌మెంట్, భారత అటవీ పరిశోధన, అభి వృద్ధి మండలి, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలకు కేంద్రం గతేడాది బడ్జెట్‌లో రూ.573.73 కోట్లు కేటాయించగా, తాజా మధ్యంతర బడ్జె ట్‌లో రూ.391 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇక అడ వుల్లో జంతు ఆవాసాల సమీకృత అభివృద్ధికి రూ.450 కోట్లను కేటాయించింది. అలాగే అడవుల పరిరక్షణ, పచ్చ దనం పెంపునకు సంబంధించి జాతీయ గ్రీన్‌ ఇండియా మిషన్‌కు గత బడ్జెట్‌లో రూ.160 కోట్లు ఉన్న కేటాయింపులను ఈ సారి రూ.220 కోట్లకు పెంచింది.  

సామాజిక న్యాయం, సాధికారతకు.. రూ.14,225 కోట్లు..
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 మధ్యంతర బడ్జె ట్‌లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు రూ.14,225.47 కోట్లు కేటాయించారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖకు రూ.13,000 కోట్లు కేటాయించగా.. వికలాంగుల సాధికారత శాఖకు రూ.1,225.27 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌ రూ.11,078.33 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 28.4% పెరిగింది. వికలాంగుల సాధికారత విభా గం కింద జాతీయ వికలాంగుల సంక్షేమానికి రూ.615 కోట్లు కేటా యించారు.

సామాజిక న్యాయం, సాధికారత శాఖ కింద షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి పథకానికి రూ.9,559.98 కోట్లు కేటాయించగా, బలహీ న వర్గాల అభివృద్ధి కార్యక్రమానికి రూ.2,150 కోట్లు కేటా యించారు. జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్, వెనుక బడి న తరగతుల జాతీయ కమిషన్, సఫాయి కర్మచారుల జాతీ య కమిషన్‌కు మొత్తం రూ.7,175 కోట్లు కేటాయించారు. 

గిరిజన మంత్రిత్వ శాఖకు.. రూ.13 వేల కోట్లు..
2024–25 మధ్యంతర బడ్జెట్‌లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేంద్రప్రభుత్వం రూ.13,000 కోట్లు కేటాయించింది. ఇది గత కేటాయింపుల కంటే భారీ అనగా 70 శాతం ఎక్కువ. 2023–24 ఆర్థిక సంవత్సరంలో గిరిజన మంత్రిత్వ శాఖకు రూ.7,605 కోట్లు కేటాయించారు. 2024– 25లో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (ఈఎమ్‌ ఆర్‌ఎస్‌) నిర్మాణానికి కేంద్రం రూ.6,399 కోట్లు కేటాయించింది. ఇది 2023–24లో కేటాయించిన రూ.2,471.81 కోట్ల కంటే 150 శాతం ఎక్కువ. ప్రధాన మంత్రి ఆది ఆదర్శ్‌ గ్రామ యోజనకు కేటాయింపులు రూ.300 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచారు.

ఈ పథకం కింద విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి–ఆదాయ కల్పన వంటి రంగాల్లోని అంతరాలను తగ్గించడానికి గిరిజన ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిధులను అందిస్తారు. గిరిజన పరిశోధనా సంస్థలకు ఆర్థిక సహాయాన్ని రూ.50 కోట్ల నుంచి రూ.111 కోట్లకు పెంచారు. కాగా, జాతీయ ఫెలోషిప్, ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్య, స్కాలర్‌షిప్‌ కోసం బడ్జెట్‌ కేటాయింపులు 2023–24లో రూ.230 కోట్ల నుంచి 2024–25లో రూ.165 కోట్లకు తగ్గించారు.  

రాష్ట్రాలకు రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు..
వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాకారం చేసే చర్యల్లో భాగంగా సంస్కరణల బాటపట్టే రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు రూ. 75 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందిస్తామని కేంద్రం తెలిపింది. 2047కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యసాధన కోసం ఈ మేరకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రాలు ఎన్నో అభివృద్ధి ఆధారిత సంస్కరణలను చేపట్టాల్సి ఉందన్నారు. అన్ని రంగాల సమ్మిళిత అభివృద్ధి సాధన దిశగా మోదీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. 

అంతరిక్షానికి అదనంగా రూ.2,000 కోట్లు..
అంతరిక్షంలో భారత కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా కలిగిన అంతరిక్ష విభాగానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రూ.2 వేల కోట్లు అదనంగా కేటాయించారు. ఈ విభాగానికి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.13,042.75 కోట్లు కేటాయించారు. 2023–24 సవరించిన అంచనాల ప్రకారం ఈ విభాగానికి రూ.11,070.07 కోట్ల కేటాయింపులు జరిగాయి.

2035 కల్లా భారత్‌ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని, 2040 కల్లా భారతీయ వోమగామి చంద్రునిపై కాలు మోపాలని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఇలావుండగా స్పేస్‌ టెక్నాలజీకి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో రూ.8,180 కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.10,087 కోట్లుగా ప్రతిపాదించారు.   

మహిళా శిశు అభివృద్ధికి రూ.26 వేల కోట్లు..
మధ్యంతర బడ్జెట్‌లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.26 వేల కోట్ల కేటాయింపులు దక్కాయి. 2023–24 బడ్జెట్‌తో పోలిస్తే ఇది 2.52 శాతం అధికం. అత్యధికంగా సాక్షం అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0లకు రూ.21,200 కోట్లు కేటాయించారు. మిషన్‌ శక్తికి రూ.3,145.97 కోట్లు ప్రతిపాదించారు. మహిళలకు భద్రత, రక్షణ అలాగే వారు తమ హక్కులు పొందడం, పలు ప్రభుత్వ పథకాలు చేరువ చేయడం లక్ష్యంగా మిషన్‌ శక్తి (సంబల్‌)కి కేంద్రం శ్రీకారం చుట్టింది.

కాగా మిషన్‌ వాత్సల్య (బాలల రక్షణ సేవలు, బాలల సంక్షేమ సేవలు)కు రూ.1,472 కోట్లు కేటాయించారు. సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం..2023–24లో మహిళా శిశు అభివృద్ధి శాఖకు రూ.25,448.68 కోట్లు కేటాయించారు. అటానమస్‌ సంస్థలకు రూ.168 కోట్ల నుంచి రూ.153 కోట్లకు బడ్జెట్‌ తగ్గింది. ఈ సంస్థల్లో సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ ఏజెన్సీ, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్, నేషనల్‌ 
కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌ ఉన్నాయి.   

ఇది కార్పొరేట్ల బడ్జెట్‌..
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కార్పొరే ట్లకు లాభాలు కట్టబెట్టే, ఓటర్లను భ్రమల్లో పెట్టే బడ్జెట్‌ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఈ బడ్జెట్‌ దారిద్య్ర రేఖకు దిగువనున్నవారికి ప్రయోజనం కల్పించేది కాదని గురువారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. కేంద్రం ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ, మరోవైపు రాయితీలకు కోత పెడుతోందన్నారు.

Interim Budget 2024: కొత్త రికార్డ్.. 56 నిమిషాల్లో బడ్జెట్ ప్రసంగం ముగించిన ఆర్థిక మంత్రి..

Published date : 02 Feb 2024 06:22PM

Photo Stories