Skip to main content

APPSC Group I: దరఖాస్తు గడువు పొడిగింపు.. స్క్రీనింగ్‌ టెస్టు తేదీ ఇదే

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రూప్‌–1 కేడర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును నవంబర్‌ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు Andhra Pradesh Public Service Commission (APPSC) ప్రకటించింది.
APPSC Group I
ఏపీపీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగింపు

ఈ మేరకు నవంబర్‌ 2న ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని గ్రూప్‌–1 కేడర్‌లోని 92 పోస్టులకు నియామక ప్రక్రియ కోసం ఏపీపీఎస్సీ సెప్టెంబర్‌ 30న నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించే పరీక్షల కోసం అక్టోబర్‌ 13 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్‌ 2వ తేదీతో గడువు ముగిసింది. అయితే గడువు పొడిగించాలని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వందలాదిగా ఏపీపీఎస్సీకి అభ్యర్థనలు అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్‌ డి.గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. సంబంధిత ఫీజును 4వ తేదీ రాత్రి 11.59లోపు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్

డిసెంబర్‌ 18న ప్రిలిమ్స్‌ 

గ్రూప్‌–1 పోస్టుల నియామకాలకు సంబంధించి ప్రిలిమినరీ(స్క్రీనింగ్‌ టెస్టు)ని డిసెంబర్‌ 18న నిర్వహిస్తున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్‌ తెలిపారు. దరఖాస్తు గడువు పొడిగించినా పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. మెయిన్స్‌ పరీక్షలను మార్చి రెండో వారం తర్వాత చేపడతామని వెల్లడించారు. 

చదవండి: ఏపీపీఎస్సీ - సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌

Published date : 03 Nov 2022 02:51PM

Photo Stories