KGBV Rankers: ఇంటర్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన కేజీబీవీ విద్యార్థినులు..
Sakshi Education
కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థినిలు ఇటీవలె విడుదలైన ఫలితాల్లో తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు ప్రిన్సిపాల్..
![KGBV School students achieves top ranks in Intermediate Exams](/sites/default/files/images/2024/04/14/kgbv-inter-results-2024-1713079863.jpg)
పుంగనూరు: ఇంటర్ ఫలితాల్లో పట్టణంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయ పాఠశాల విద్యార్థిని కేపీ అతికున్నిసా 979 మార్కులు సాధించి స్టేట్లో టాపర్గా నిలిచిందని ప్రిన్సిపాల్ వాసియా ఫర్హత్ తెలిపారు. ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ కేజీబీవీలో 33 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపారు.
APPSC Group-1 Prelims Results: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 4,496 మంది అభ్యర్థులు అర్హులు..!
వారిలో 28 మంది ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు. కేపీ అతికున్నిసా 979 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్గా , అజ్మియాభాను 954 మార్కులు, సబానాజ్ 944 మార్కులతో ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. అలాగే, ప్రథమ సంవత్సరంలో యాస్మిన్ 484, కళ్యాణి 479, మెహతాజ్ 476 మార్కులు సాధించినట్టు పేర్కొన్నారు.
Published date : 14 Apr 2024 01:01PM