ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో ప్రవేశాలు
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ గురుకుల ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ శిరీష ఏప్రిల్ 10న ఓ ప్రకటనలో తెలిపారు.
కోస్తాంధ్రలోని తొమ్మిది జిల్లాల వారీగా ముస్లిం, మైనార్టీ విద్యార్థులకు పాత గుంటూరు నందివెలుగురోడ్డులో నిర్వహిస్తున్న ఏపీఆర్ ఉర్దూ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఇంగ్లిష్ మీడియంలో చేరేందుకు ఆసక్తి గల వారు ఏపీఆర్జేసీ సెట్తో సంబంధం లేకుండా ఈనెల 24లోపు httpr://aprr.apcfrr.in/ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రస్తుతం జరుగుతున్న టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడంతో పాటు ముస్లిం, మైనార్టీగా నమోదైన ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలని తెలిపారు. ఇతర వివరాలకు నందివెలుగురోడ్డులోని కళాశాలలోగానీ, 9701451826, 9849559611 నంబర్లలోగానీ సంప్రదించాలని సూచించారు.
చదవండి:
EAMCET 2023: ఎంసెట్కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..
TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం
Published date : 11 Apr 2023 04:28PM