Skip to main content

Education: విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు...

మనబడి నాడు–నేడు ఫేజ్‌–1, ఫేజ్‌–2 అభివృద్ధి పనుల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 540 పాఠశాలల్లో 814 పనులను రూ.144.78 కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది. సర్కారు బడులకు ఆధునిక సొబగులు అద్దుతోంది.
Education
విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు...
  • జగనన్న గోరుముద్దను 1582 పాఠశాలల్లో అమలు చేస్తోంది. 71,280 మంది విద్యార్థులకు పోషకాలతో కూడిన రుచికరమైన ఆహారాన్ని సమకూర్చుతోంది.
  • ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఏ విద్యార్థి విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి 86,490 మంది తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.129.61కోట్లను జమ చేసింది.
  • జగన్న విద్యాకానుక పథకం కింద 97,474మంది విద్యార్థులకు జగనన్న విద్యాకిట్లను అందజేసేందుకు జిల్లాకు రూ.29.69 కోట్లను ఖర్చుచేసింది.
  • కార్పొరేట్‌ తరహా విద్యను అందించేందుకు బైజూస్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్‌లైన్‌ కంటెంట్‌ కోసం జిల్లాలో 9,775 మంది విద్యార్థులు, 1878 మంది ఉపాధ్యాయులకు రూ.37.39 కోట్ల విలువైన ట్యాబ్‌లను సమకూర్చింది.
Published date : 10 Apr 2023 06:23PM

Photo Stories